NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. జులై 8న కాజీపేటలో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన
    తదుపరి వార్తా కథనం
    ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. జులై 8న కాజీపేటలో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన
    జులై 8న కాజీపేటలో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన

    ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. జులై 8న కాజీపేటలో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 28, 2023
    02:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు జులై 12న మోదీ రాష్ట్రానికి రానున్నారని రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

    కాజీపేటలో రైల్వే కోచ్‌ పీరియాడిక్‌ ఓవర్‌ హాలింగ్‌ (పీఓహెచ్‌) కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

    అయితే గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఈ నెలాఖరులోపు ప్రధాని రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది.

    ప్రత్యేక పరిస్థితుల్లో ఆ కార్యక్రమం వాయిదా పడిందని చెప్పిన పార్టీ వర్గాలు, తాజా షెడ్యూల్ ప్రకారం జులై 12నే రానున్నట్లు స్పష్టం చేశాయి.

    శంకుస్థాపన అనంతరం వరంగల్‌ గడ్డ మీద ప్రధాని సభ నిర్వహణకు కృషి చేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతలు ప్రకటించారు.

    details

     రాష్ట్రానికి 600 మంది బూత్‌ కమిటీ సభ్యులు  

    మరో 2 రోజుల్లో పూర్తి వివరాలు అందుతాయని పార్టీ నేతలు వివరించారు. మరోవైపు హైదరాబాద్‌ మహానగరం వేదికగా జులై 8న 11 రాష్ట్రాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు.

    ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సదస్సులో తెలంగాణకు సంబంధించి కీలక నిర్ణయాలు జరగొచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు.

    మరోవైపు భోపాల్ సభలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది బూత్‌ కమిటీ సభ్యులు ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు.

    జులై 5 వరకు తెలంగాణలో బీజేపీ బలోపేతానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్‌లలో బృందాలుగా విడిపోనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    బీజేపీ

    తాజా

    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్
    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్
    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్

    నరేంద్ర మోదీ

    అమెరికా: న్యూజెర్సీ రెస్టారెంట్‌లో 'మోదీ జీ థాలీ'; ఆ వంటకం ప్రత్యేకలు ఇవే  అమెరికా
    అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ; తొలి భారతీయుడిగా రికార్డు  అమెరికా
    బిపోర్‌జాయ్‌ తుపానుపై ప్రధాని హై లెవల్ మీటింగ్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం ప్రధాన మంత్రి
    నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్చిన కేంద్రం; కాంగ్రెస్ ఫైర్ కాంగ్రెస్

    బీజేపీ

    ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ట్విట్టర్
    Karnataka Elections 2023: హిమాచల్ ఎన్నికల ఫలితాలే కర్ణాటకలో రిపీట్ అవుతాయా?  కర్ణాటక
    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  అసదుద్దీన్ ఒవైసీ
    'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025