NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు.. ఆనందం, విజయం కలగాలని ప్రధాని ట్వీట్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు.. ఆనందం, విజయం కలగాలని ప్రధాని ట్వీట్
    ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు.. ఆనందం, విజయం కలగాలని ప్రధాని ట్వీట్

    PM Modi: ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు.. ఆనందం, విజయం కలగాలని ప్రధాని ట్వీట్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 31, 2025
    11:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నారు.

    వివిధ మసీదుల వద్ద సందడిగా మారిపోయిన వాతావరణంలో, ముస్లిం సోదరులు పరస్పరం ఆలింగనం చేసుకుంటూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటున్నారు.

    ఈ ప్రత్యేక సందర్భంలో దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.

    వివరాలు 

    ఈద్ ముబారక్!" అంటూ మోడీ ట్వీట్ 

    ప్రధాని మోదీ తన 'ఎక్స్' పోస్ట్ ద్వారా ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

    "ఈ పండుగ మన సమాజంలో ఆశ, ఏకత, సహానుభూతి వంటి విలువలను మరింతగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మీ జీవన ప్రయాణంలో అన్ని మంచి ప్రయత్నాలలో విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈద్ ముబారక్!" అంటూ ఆయన రాశారు.

    పవిత్ర రంజాన్ మాసం ముగిసిన అనంతరం ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ పండుగను జరుపుకుంటారు.

    ముస్లింలకు ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. ఆదివారం రాత్రి దేశంలో ఈద్ చంద్రుడు దర్శనమిచ్చినందున, సోమవారం దేశవ్యాప్తంగా పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

    Greetings on Eid-ul-Fitr.

    May this festival enhance the spirit of hope, harmony and kindness in our society. May there be joy and success in all your endeavours.

    Eid Mubarak!

    — Narendra Modi (@narendramodi) March 31, 2025

    వివరాలు 

    యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు.

    ఈ ప్రత్యేక వేడుక సందర్భంగా, సమాజంలో సద్భావన, సామాజిక ఏకతను మరింతగా బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరూ సంకల్పించుకోవాలని ఆయన సూచించారు.

    ముఖ్యమంత్రి కార్యాలయం 'ఎక్స్' సోషల్ మీడియా ద్వారా, సీఎం యోగి ఆదిత్యనాథ్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినట్లు ప్రకటించింది.

    దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆకాశంలో ఈద్ చంద్రుడు కనిపించడంతో పవిత్ర రంజాన్ మాసం ముగిసినట్లయింది.

    దాంతో, నేడు (సోమవారం) దేశవ్యాప్తంగా ఈద్ పండుగ ఉత్సాహంగా నిర్వహించబడుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు

    #UPCM @myogiadityanath ने ईद-उल-फ़ित्र के अवसर पर प्रदेशवासियों को हार्दिक बधाई और शुभकामनाएं दी हैं।

    मुख्यमंत्री जी ने कहा कि ईद-उल-फ़ित्र का त्योहार खुशी और मेल-मिलाप का संदेश लेकर आता है।

    खुशियों का यह त्योहार सामाजिक एकता को मजबूत करने के साथ ही, आपसी भाईचारे की भावना को…

    — CM Office, GoUP (@CMOfficeUP) March 30, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    యోగి ఆదిత్యనాథ్

    తాజా

    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి

    నరేంద్ర మోదీ

    PM Modi Trump Meet: ముందుగా టారీఫ్‌లు... తర్వాత వాణిజ్య ఒప్పందాలు! డొనాల్డ్ ట్రంప్
    Narendra Modi: అమెరికాకు 'మాగా', ఇండియాకు 'మిగా'.. ట్రంప్‌తో భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు భారతదేశం
    Modi-Trump: అక్రమ వలసదారులను వెనక్కి తీసుకురావడానికి సిద్ధం: అమెరికాలో మోదీ కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Modi-Trump: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యు ఆర్ గ్రేట్': నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక బహుమతి డొనాల్డ్ ట్రంప్

    యోగి ఆదిత్యనాథ్

    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ అఖిలేష్ యాదవ్
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025