NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కత్తులతో మార్కెట్‌లో వ్యక్తి వీరంగం, షూట్ చేసిన పోలీసులు
    భారతదేశం

    కత్తులతో మార్కెట్‌లో వ్యక్తి వీరంగం, షూట్ చేసిన పోలీసులు

    కత్తులతో మార్కెట్‌లో వ్యక్తి వీరంగం, షూట్ చేసిన పోలీసులు
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 06, 2023, 03:35 pm 0 నిమి చదవండి
    కత్తులతో మార్కెట్‌లో వ్యక్తి వీరంగం, షూట్ చేసిన పోలీసులు
    కర్ణాటక కలబురగిలో కత్తులతో వ్యక్తి వీరంగం

    కర్నాటకలోని కలబురగిలో ఒక వ్యక్తి కత్తులతో వీరంగం సృష్టించారు. మార్కెట్ ప్రాంతంలో సాధారణ ప్రజలపై దాడి చేస్తానని బెదిరిస్తున్న అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు. కలబురగి మార్కెట్‌లో ఫజల్ భగవాన్ అనే నిందితుడు చేతిలో కత్తులు, పదునైన ఆయుధాలతో సంచరిస్తూ కనిపించాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడికి యత్నించాడు. ఆత్మరక్షణ , ప్రజల భద్రత కోసం పోలీసు అధికారులు అతని కాలుపై షూట్ చేసి గాయపరిచారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు కలబురగి పోలీస్ కమిషనర్ చేతన్ వెల్లడించారు.

    చికిత్స అందించిన తర్వాత అరెస్టు

    ఘటనకు సంబంధించిన వివరాలను కలబురగి పోలీస్ కమిషనర్ చేతన్ వివరించారు. పోలీసు సిబ్బందిపై దాడికి యత్నించినందుకే అతడిపై కాల్పులు చేసినట్లు వెల్లడించారు. అతడిని ఆసుపత్రికి తరలించామని, నిందితుల వివరాలను ఇంకా సేకరించాల్సి ఉందన్నారు. పూర్తి వివరాలను సేకరించిన తర్వాత వెల్లడిస్తామని కమిషనర్ చెప్పారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి, గాయాలకు చికిత్స అందించిన తర్వాత అరెస్టు చేశారు. ఫజల్ భగవాన్‌కు మానసిక స్థితి బాగా లేకనే ఈ వ్యవహరించిన ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కర్ణాటక

    తాజా

    మార్చి 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్

    కర్ణాటక

    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం! అసెంబ్లీ ఎన్నికలు
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? బెంగళూరు
    శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ ఎన్ఐఏ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023