NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదు: ప్రధాని మోదీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదు: ప్రధాని మోదీ

    PM Modi: పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదు: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 21, 2025
    01:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం దేశ ప్రజల వెయ్యేళ్ల భవిష్యత్తుపై ప్రభావం చూపగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

    ఈ టెక్నాలజీ ఆధారిత యుగంలో పరిపాలన అనేది కేవలం పరిపాలనా వ్యవస్థలను నడిపించడం కాదని, భవిష్యత్తు అవకాశాలను ముందుగానే గుర్తించగలగడం అవసరమని చెప్పారు.

    సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.

    వివరాలు 

    భవిష్యత్తుపై సానుకూల ప్రభావం

    ''సమగ్ర అభివృద్ధి అనే పదానికి అసలు అర్థం.. దేశంలోని ఒక్క గ్రామం,ఒక్క కుటుంబం లేదా ఒక్క పౌరుడైనా వెనకబడకూడదు.ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న ప్రతి నిర్ణయం ప్రజల దీర్ఘకాలిక భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుందన్న దానిపై ఏ మాత్రం సందేహం లేదు.ఇది ముఖ్యంగా యువత,రైతులు,మహిళల ఆకాంక్షలను తీర్చడంలో తోడ్పడుతుంది.ఈ తరహా అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలంటే, సాధారణ ప్రయత్నాలు సరిపోవు.అదే వేగంతో,అదే సంకల్పంతో ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది,'' అని ప్రధాని పేర్కొన్నారు.

    వివరాలు 

    టెక్నాలజీ  కీలకం.. 

    అదే సమయంలో ఆయన టెక్నాలజీ ప్రాధాన్యతను కూడా ప్రస్తావిస్తూ, ''ఈ వేగంగా మారుతున్న టెక్నాలజీ కాలంలో పరిపాలన అంటే కేవలం వ్యవస్థలను నిర్వహించడమే కాదు. ప్రజల కోసం కొత్త అవకాశాలను సృష్టించడమే నిజమైన పరిపాలన. ప్రభుత్వ పథకాలు ప్రజలపై ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయన్నది ఎంతో కీలకమైంది. అదే ఆధారంగా పరిపాలన నాణ్యతను మెరుగుపరచవచ్చు. గత పదేళ్లలో భారతదేశం ఎన్నో కీలక మార్పులను చూసింది. పాలనలో పారదర్శకత, ఆవిష్కరణ వంటి అంశాల్లో దేశం ఓ కొత్త స్థాయిని చేరుకుంది,'' అని వివరించారు.

    వివరాలు 

    భారత్ ప్రపంచంలో అగ్రగామిగా మారుతోంది: మోదీ 

    మోదీ 2023లో భారతదేశం జీ20కు ఆతిథ్యమిచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ''అప్పుడు 'జనభాగిదారి' (ప్రజల భాగస్వామ్యం) విధానం వల్ల ఈ కార్యక్రమం ఓ ప్రజా ఉద్యమంగా మారింది. దీనివల్ల ప్రపంచమంతా భారతదేశంపై దృష్టి పెట్టింది. కేవలం కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, వాటిని సమర్థవంతంగా నిర్వహించే స్థాయికి మన దేశం ఎదిగింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో అగ్రగామిగా మారుతోంది,'' అని తెలిపారు.

    ఈ సందర్భంలో సివిల్ సర్వీసు అధికారుల వైపు మనసు తిప్పుతూ, ప్రధానమంత్రి మోదీ ఒక విజ్ఞప్తి చేశారు.

    ''పేదల సమస్యలను మనస్పూర్తిగా వినాలి. వారితో సంయమనం పాటిస్తూ, గౌరవంగా వ్యవహరించాలి. వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి,'' అని ఆకాంక్షించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    నరేంద్ర మోదీ

    PM Modi: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం.. దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు రంజాన్
    PM Modi: గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.. భారతదేశం
    PM Modi:మే నెలలో సింహాల గణన.. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ   భారతదేశం
    Cop Slaps Boy: సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్‌.. సైకిల్ తొక్కిన బాలుడిని చితకబాదిన పోలీసులు! గుజరాత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025