NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ
    భారతదేశం

    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ

    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 13, 2023, 12:23 pm 1 నిమి చదవండి
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ
    'ఎంవీ గంగా విలాస్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ

    ప్రపంచంలోనే అతిపొడవైన నదీ యాత్రకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వారణాసిలో ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ 'ఎంవీ గంగా విలాస్‌'ను వర్చువల్‌గా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశ పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే కార్యక్రమంలో ప్రధానమంత్రి వారణాసిలోని టెంట్ సిటీని ప్రారంభించారు. అలాగే.. రూ.1000 కోట్ల విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమానికి ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

    ప్రత్యేకతలు: 51 రోజులపాటు 3,200 కిలోమీటర్ల ప్రయాణం

    'ఎంవీ గంగా విలాస్' క్రూయిజ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. 51 రోజులపాటు భారతదేశంలోని ఐదు రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాల గుండా మొత్తం 3,200 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది. అస్సాంలోని దిబ్రూఘర్ దీని చివరి గమ్యస్థానం. మూడు అంతస్థులు ఉండే ఈ నౌకలో మొత్తం 18సూట్స్ ఉంటాయి. ఒకసారి 36మంది ప్రయాణించవచ్చు. మొత్తం 27నదుల గుండా ఈనౌక ప్రయాణం సాగుతుంది. ఫ్రెంచ్ బాల్కనీలు, ఎల్ఈడీ టీవీలు, స్మోక్ డిటెక్టర్లు, కన్వర్టిబుల్ బెడ్‌లు, రెస్టారెంట్, స్పా వంటి అత్యాధునిక సౌకర్యలు ఇందులో ఉన్నాయి. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.25వేలు కాగా.. తొలి యాత్ర కోసం 32మంది స్విజ్ టూరిస్టులు క్రూయిజ్‌ను మొత్తాన్ని బుక్ చేసుకున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    తన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ తెలుగు సినిమా
    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే విశాఖపట్టణం
    బైక్‌పై వెళ్తున్న అమృత్‌పాల్ సింగ్ ఫొటో వైరల్; అతని భార్యను ప్రశ్నించిన పోలీసులు పంజాబ్
    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక ఆటో మొబైల్

    ఉత్తర్‌ప్రదేశ్

    ఉమేష్ పాల్ హత్య కేసు నిందితులకు నేపాల్‌లో ఆశ్రయం; అండర్ వరల్డ్‌ నాయకుడు అన్సారీ అరెస్టు భారతదేశం
    ఉత్తర్‌ప్రదేశ్ హత్య కేసు: ఉమేష్ పాల్‌పై కాల్పులు జరుపుతున్న సీసీటీవీ వీడియో వైరల్ తుపాకీ కాల్పులు
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ అలహాబాద్
    రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ

    నరేంద్ర మోదీ

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష ప్రధాన మంత్రి
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు దిల్లీ
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్

    ప్రధాన మంత్రి

    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక
    వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు నరేంద్ర మోదీ
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ కాంగ్రెస్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023