NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dilli Chalo: ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అంబాలాలో నిషేధాజ్ఞలు
    తదుపరి వార్తా కథనం
    Dilli Chalo: ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అంబాలాలో నిషేధాజ్ఞలు
    ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అంబాలాలో నిషేధాజ్ఞలు

    Dilli Chalo: ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అంబాలాలో నిషేధాజ్ఞలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 06, 2024
    09:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రైతులు మరోసారి తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించడానికి పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు ప్రాంతంలో 'ఢిల్లీ చలో' పేరుతో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా అనేక డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం.

    ఈ క్రమంలో,ఇప్పటికే వేలాది మంది రైతులు శంభు సరిహద్దులో చేరుకున్నారు.

    రైతు సంఘాలు శంభు- ఖనౌరి సరిహద్దుల నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేయాలని పిలుపునిచ్చాయి.

    అయితే ఖనౌరి సరిహద్దు వద్ద రైతులు తాత్కాలికంగా నిలిచిపోయారు.

    ఢిల్లీ దిశగా యాత్ర ప్రారంభించాల్సిన తేదీని ఇంకా నిర్ణయించలేదు.

    వివరాలు 

    శంభు సరిహద్దు నుంచి పాదయాత్ర

    ఈ పరిణామాల వల్ల రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్‌ జామ్‌ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

    రైతుల ఉద్యమం నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించారు.

    అదనంగా మూడు స్థాయుల బారికేడ్లను ఏర్పాటు చేసి, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా నిషేధాజ్ఞలు విధించారు.

    కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా సమన్వయకర్త శర్వణ్‌ సింగ్‌ పాంథేర్‌ ప్రకటన ప్రకారం, రైతులు ట్రాక్టర్లు లేదా ఇతర వాహనాల వినియోగం లేకుండా కేవలం కాలినడకన పాదయాత్ర చేస్తారు.

    శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 101 మంది రైతులతో శంభు సరిహద్దు నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని, ఢిల్లీ వరకు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు.

    వివరాలు 

    సమస్యల పరిష్కారానికి చర్చలకు సిద్ధం: పాంథేర్‌

    రైతుల ఉద్యమానికి ఖాప్‌ పంచాయతీలు, వ్యాపార వర్గాలు మద్దతు తెలపడం విశేషం.

    గతంలో, కేంద్ర ప్రభుత్వంతో నాలుగు రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, ఫిబ్రవరి 18 తర్వాత ఎలాంటి చర్చలు జరగలేదని, తమ సమస్యల పరిష్కారానికి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాంథేర్‌ తెలిపారు.

    ప్రభుత్వం తమ యాత్రను అడ్డుకుంటే అది తమ ఉద్యమ విజయంగా భావిస్తామని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    దిల్లీ

    Delhi air pollution: ఢిల్లీలో కొనసాగుతున్న ప్రమాద ఘంటికలు.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే భారతదేశం
    Delhi Air Pollution: దిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం కఠిన చర్యలు.. జరిమానాల మొత్తాలు రెట్టింపు  భారతదేశం
    Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు  భారతదేశం
    Delhi Nyay Yatra: నేడు రాజ్‌ఘాట్ నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ ఢిల్లీ 'న్యాయ యాత్ర ' కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025