
Swecha Votarkar: ప్రముఖ న్యూస్ యాంకర్ ఆత్మహత్య!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (40) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్నగర్లో తన నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకొని స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్వేచ్ఛ 2014లో భర్త క్రాంతి కిరణ్తో విడాకులు తీసుకున్నారు. అనంతరం కొంతకాలం రాంనగర్లోని తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవితో కలిసి నివాసం సాగించారు. గత నాలుగేళ్లుగా స్వేచ్ఛ తన కూతురితో కలిసి జవహర్నగర్లోని శీలం రెసిడెన్సీలో ఉన్న పెంట్హౌస్లో నివాసం ఉంటున్నారు.
Details
కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఇదే ఇంట్లో ఆమె స్నేహితుడు కూడా నివసిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఫ్యాన్కు వేలాడుతున్న స్వేచ్ఛను గుర్తించిన వెంటనే పోలీసులు సమాచారం అందుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో స్వేచ్ఛ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఈసీ మెంబర్గా ఎన్నికయ్యారు. ఆమె మరణం మీడియా వర్గాల్లో విషాదాన్ని నింపింది.