NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Punjab: పంజాబ్ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    Punjab: పంజాబ్ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన ప్రారంభం
    పంజాబ్ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన ప్రారంభం

    Punjab: పంజాబ్ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన ప్రారంభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 24, 2025
    11:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాష బోధనను ప్రారంభించనుంది.

    ఈ నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో ఈ నెల 26వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు వేసవి శిబిరాలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

    ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు కొత్త భారతీయ భాషలలో ప్రాథమిక సంభాషణా నైపుణ్యాలు నేర్పించడమేనని అధికార వర్గాలు తెలిపాయి.

    ఈ నేపథ్యంలో తెలుగు భాషను కూడా వేసవి శిబిరాల్లో బోధించనున్నారు. వేసవి శిబిరాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులు పాల్గొననున్నారు.

    ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

    Details

    ఈ నిర్ణయాన్ని తప్పుపట్టిన డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్

    విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూపునకు మూడు గంటల పాటు తెలుగు బోధన చేయాలంటూ విద్యాశాఖ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, పంజాబ్ ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని కొంతమంది స్వాగతిస్తుండగా, మరికొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

    పంజాబ్‌లోని డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ (DTF) ఈ నిర్ణయాన్ని తప్పుబడుతోంది.

    రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులు పంజాబీని మాతృభాషగా కలిగి ఉన్నప్పటికీ, ఇటీవల 12వ తరగతిలో 3,800 మందికి పైగా విద్యార్థులు, 10వ తరగతిలో 1571 మంది విద్యార్థులు జనరల్ పంజాబీలో ఉత్తీర్ణులు కాలేదని డీటీఎఫ్ వెల్లడించింది.

    విద్యార్థుల ప్రాథమిక భాషా నైపుణ్యాలను బలోపేతం చేయాల్సిన సమయంలో మరో భాషను బోధించడం విద్యా విధానాన్ని దెబ్బతీసే ప్రమాదముందని డీటీఎఫ్ అభిప్రాయపడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్

    తాజా

    Punjab: పంజాబ్ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన ప్రారంభం పంజాబ్
    Mukul Dev: ప్రముఖ నటుడు కన్నుమూత బాలీవుడ్
    Vallabhaneni Vamsi: కస్టడీలో వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు వల్లభనేని వంశీ
    IndiGo Flight: అనుమతికి పాక్ 'నో'.. 227 మందిని కాపాడిన పైలట్లు  ఇండిగో

    పంజాబ్

    Birthday Cake: పుట్టినరోజు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి  భారతదేశం
    Amritpal Singh: ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్ తల్లి అరెస్ట్.. కారణం ఇదే..  అమృత్‌సర్
    Birthday Cake: కేక్‌ తిని బాలిక మృతి .. మరణానికి కారణం ఇదే !  భారతదేశం
    Amritpal Singh: ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైన ఖలిస్తానీ మద్దతుదారు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025