రాజస్థాన్: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి
రాజస్థాన్లోని హనుమాన్గఢ్లో సోమవారం మిగ్-21 యుద్ధ విమానం కూలింది. కూలే క్రమంలో ఆ విమానం ఒక ఇంటిని ఢీ కొట్టడంతో ఇంట్లోని నలుగురు నలుగురు మృతి చెందారు. పైలట్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ చేపట్టినట్లు ఐఏఎఫ్ తెలిపింది. మిగ్ -21 జెట్ సూరత్గఢ్ నుంచి బయలుదేరినట్లు ఐఏఎఫ్ వర్గాల తెలిపాయి. ఇదిలా ఉంటే, మృతుల కుటుంబ సభ్యులు జిల్లా యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.