LOADING...
West Bengal: బెంగాల్‌లో రాజ్యసభ ఉప ఎన్నికల నగారా.. జూలై 24న పోలింగ్
బెంగాల్‌లో రాజ్యసభ ఉప ఎన్నికల నగారా.. జూలై 24న పోలింగ్

West Bengal: బెంగాల్‌లో రాజ్యసభ ఉప ఎన్నికల నగారా.. జూలై 24న పోలింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అధికార మార్పు తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి,తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వరుసగా రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈడీ,ఆదాయపు పన్ను(ఐటీ)దర్యాప్తులు కొనసాగుతుండగా,ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన పలువురు ప్రముఖులపై కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య మరో కీలక పరిణామంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన మూడు రాజ్యసభ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24వ తేదీన ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై, రాత్రికే ఫలితాలను వెల్లడించనున్నారు.

వివరాలు 

ముగ్గురు సభ్యుల రాజీనామాతో ఖాళీలు

పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు తమ పదవీకాలం పూర్తికాకముందే రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. గత నెల 8వ తేదీన సుఖేందు శేఖర్ రాయ్, 10వ తేదీన సుస్మితా దేవ్, 11వ తేదీన ప్రకాశ్ చిక్ బరాక్ తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అనంతరం వారి రాజీనామాలను ఆమోదించారు. ఈ ఉప ఎన్నికల్లో గెలిచే కొత్త సభ్యులు ఆయా స్థానాల మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేస్తారు. వీరిలో కొందరి పదవీకాలం 2029 ఆగస్టు వరకు, మరికొందరి పదవీకాలం 2030 ఏప్రిల్ వరకు కొనసాగనుంది.

వివరాలు 

ఉప ఎన్నికల పూర్తి షెడ్యూల్

ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్ల దాఖలుకు 14వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపడతారు. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. జూలై 24న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు. మొత్తం ఉప ఎన్నికల ప్రక్రియను 27వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

వివరాలు 

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

ఉప ఎన్నికలను ఎలాంటి వివాదాలకు తావులేకుండా, పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ కోసం సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక పర్యవేక్షక బృందాలను నియమించనుంది. అదే విధంగా, నిష్పక్షపాత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తగిన భద్రతా సిబ్బందితో పాటు ప్రత్యేక పరిశీలకులను కూడా నియమిస్తున్నట్లు ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు.

Advertisement