Nitin Gadkari: గడ్కరీ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. డీప్ఫేక్ కంటెంట్ తొలగించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ప్రభుత్వ E20 ఎథనాల్ బ్లెండింగ్ కార్యక్రమంతో తనను, తన కుటుంబాన్ని అక్రమంగా అనుసంధానిస్తూ రూపొందించిన డీప్ఫేక్ వీడియోలు, AI ఆధారిత తప్పుడు చిత్రాలు, దుర్వినియోగ సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గడ్కరీ గుర్తించిన అభ్యంతరకర కంటెంట్ను వెంటనే తొలగించాలని మెటా, గూగుల్/యూట్యూబ్తో పాటు సంబంధిత సోషల్ మీడియా మధ్యవర్తులకు హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఆ కంటెంట్ను కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజలకు అందుబాటులో ఉండే వేదికల్లో ఇలాంటి పోస్టులకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేసింది.
వివరాలు
పిటిషనర్ తొలగించాలని కోరిన కంటెంట్ అత్యంత కీచకమైనవి
విచారణ సందర్భంగా న్యాయస్థానం, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లోని ట్రాన్స్క్రిప్ట్ను పరిశీలించినట్లు పేర్కొంది.
పిటిషనర్ తొలగించాలని కోరిన కంటెంట్ అత్యంత కీచకమైనవి, దుర్వినియోగపూరితమైనదిగా ఉందని అభిప్రాయపడింది.
ముఖ్యంగా యువత సహా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే సోషల్ మీడియా వేదికల్లో ఇటువంటి కంటెంట్ కొనసాగడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది.
కోర్టు తాత్కాలిక ఉపశమనం మంజూరు చేసిన నేపథ్యంలో, తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాతకు వాయిదా వేసింది.
ఈ కేసులో నితిన్ గడ్కరీ మెటా, ఎక్స్, గూగుల్/యూట్యూబ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్,సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ విభాగం, అలాగే గుర్తుతెలియని వినియోగదారులను ప్రతివాదులుగా చేర్చారు. గుర్తించని వ్యక్తులను పిటిషన్లో "అశోక్ కుమార్/జాన్ డో"గా పేర్కొన్నారు.
వివరాలు
తప్పుడు ప్రచారం
పిటిషన్లో భాగంగా,ఎథనాల్ బ్లెండింగ్ కార్యక్రమానికి తనను తప్పుగా అనుసంధానిస్తూ రూపొందించిన వీడియోలు,చిత్రాలు, AI సాయంతో సృష్టించిన డీప్ఫేక్ కంటెంట్ను శాశ్వతంగా తొలగించేలా తప్పనిసరి ఆదేశాలు ఇవ్వాలని గడ్కరీ కోర్టును కోరారు.
పిటిషన్ ప్రకారం, కొన్ని సోషల్ మీడియా పోస్టులు ప్రభుత్వ ఎథనాల్ విధానానికి నితిన్ గడ్కరీ వ్యక్తిగతంగా బాధ్యత వహించినట్లు తప్పుడు ప్రచారం చేశాయి.
అంతేకాదు, ఆయన కుటుంబం ఈ విధానం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందిందని కూడా నిరాధార ఆరోపణలు చేశాయి.
ప్రత్యేకంగా, ఆయన కుమారుడు నిఖిల్ గడ్కరీ CIAN అగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ఎథనాల్ తయారీ సంస్థను నిర్వహిస్తున్నారని, ఆ సంస్థ ప్రభుత్వ ఎథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం వల్ల లాభపడుతోందని ప్రచారం చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
వివరాలు
ఆరోపణలను ఖండించిన నితిన్ గడ్కరీ
ఈ ఆరోపణలను నితిన్ గడ్కరీ పూర్తిగా ఖండించారు.
తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించినట్లు, ప్రజా పదవిని దుర్వినియోగం చేసినట్లు తప్పుడు ప్రచారం చేసేలా ఈ కంటెంట్ రూపొందించబడిందని ఆయన తెలిపారు.
అంతేకాదు,E20 పెట్రోల్ ప్రవేశపెట్టడం లేదా అమలు చేయడంలో తానే ప్రత్యక్షంగా పాత్ర పోషించినట్లు,ఎథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్న పోస్టులను కూడా ఆయన సవాలు చేశారు.
వివరాలు
ఆరోపణలను ఖండించిన నితిన్ గడ్కరీ
అయితే,ఈ పిటిషన్ ఉద్దేశం ప్రభుత్వ విధానాలపై లేదా తన ప్రజా జీవితంపై వచ్చే న్యాయమైన విమర్శలను అడ్డుకోవడం కాదని గడ్కరీ స్పష్టం చేశారు.
తాను అభ్యంతరం వ్యక్తం చేసిన కంటెంట్లో కృత్రిమంగా సృష్టించిన దృశ్యాలు,వక్రీకరించిన వ్యాఖ్యలు,అసత్య ఆరోపణలు,దుర్వినియోగ భాష ఉన్నాయని,అవి రాజకీయ విమర్శ లేదా వ్యంగ్యానికి ఉండాల్సిన హద్దులను దాటిపోయాయని ఆయన కోర్టుకు వివరించారు.