NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi:'రూ. 2,000 కోట్ల స్కాం': ఆప్‌కి చెందిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లపై కొత్త కేసు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi:'రూ. 2,000 కోట్ల స్కాం': ఆప్‌కి చెందిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లపై కొత్త కేసు 
    'రూ. 2,000 కోట్ల స్కాం': ఆప్‌కి చెందిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లపై కొత్త కేసు

    Delhi:'రూ. 2,000 కోట్ల స్కాం': ఆప్‌కి చెందిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లపై కొత్త కేసు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 30, 2025
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ల మెడకు మరో అవినీతి కేసు చుట్టుకుంది.

    ఢిల్లీలో ఆప్ పాలనలో నిర్వహించిన పాఠశాలలు, తరగతి గదుల నిర్మాణంలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తీవ్ర ఆరోపణలు చేసింది.

    మొత్తం 12 వేల స్కూళ్లు, తరగతి గదుల నిర్మాణం చేపట్టిన ప్రక్రియలో సుమారు రూ.2 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని అధికారులు వెల్లడించారు.

    ఈ నేపథ్యంలో అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మాజీ పీడబ్ల్యూడీ మంత్రి సత్యేందర్ జైన్‌లపై అధికారికంగా కేసు నమోదు చేశారు.

    వివరాలు 

    12,748 క్లాస్ రూం నిర్మాణాలు 

    ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కాలంలో మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.

    అదే సమయంలో సత్యేందర్ జైన్ ప్రజారంగ వర్క్స్ శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రిగా వ్యవహరించారు.

    ఆ కాలంలో మొత్తం 12,748 క్లాస్ రూం నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

    ఈ నిర్మాణాలకు కాంట్రాక్టులు పొందిన వారిలో చాలామంది ఆప్ పార్టీకి చెందిన వ్యక్తులేనని ఏసీబీ ఆరోపించింది.

    ఇంకా, కాంట్రాక్టులు పొందిన సంస్థలు పనులను నిర్ధేశించిన గడువులో పూర్తిచేయలేకపోయాయని, ఫలితంగా నిర్మాణ వ్యయం ఐదంతుల మేరకు పెరిగిందని పేర్కొన్నారు.

    వివరాలు 

    మనీలాండరింగ్ ఆరోపణల జైలుకి వెళ్లిన సత్యేందర్ జైన్

    ఈవిషయంలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కూడా పరిశీలన జరిపి అక్రమాలు జరిగాయని నివేదికను ఇచ్చిందని,అయితే ఆ నివేదికను ఆప్ ప్రభుత్వం సుమారు మూడు సంవత్సరాల పాటు బహిర్గతం చేయకుండా దాచేసిందని ఆరోపిస్తున్నారు.

    తరగతి గదుల నిర్మాణ ఖర్చు అసాధారణంగా పెరగడంతో బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ప్రారంభమై ఈఅంశాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం.

    ఢిల్లీపాలనలో కీలక స్థానాలు చేపట్టిన ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే వివిధ అవినీతి కేసుల్లో చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు.

    మద్యంవిధానానికి సంబంధించిన కేసులో మనీశ్ సిసోడియా,మనీలాండరింగ్ ఆరోపణలతో సత్యేందర్ జైన్ అరెస్టయ్యి జైలు శిక్షను అనుభవించారు.

    ప్రస్తుతం ఇద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు.ఈతరుణంలో తాజా స్కూల్ కట్టడాల కుంభకోణం ఆరోపణలతో మరోసారి ఆప్ శిబిరంలో కలవరం ఏర్పడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    Sunitha Kejriwal: ఆప్ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం.. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల  గుజరాత్
    Lok Sabha elections: 'ఆప్ కా రామ్ రాజ్య' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఆప్ భారతదేశం
    Arvind Kejriwal-Tihar Jail: తిహార్ జైలు సిబ్బంది తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారమిస్తోంది: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్
    Aravind Kejriwal: కేజ్రీవాల్ కు జైలులో మొదటి ఇన్సులిన్ .. భారీగా పెరిగిన షుగర్ లెవల్స్ అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025