NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: 'వికసిత్ భారత్'లో ఆరెస్సెస్‌ పాత్ర కీలకం: ప్రధాని మోదీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: 'వికసిత్ భారత్'లో ఆరెస్సెస్‌ పాత్ర కీలకం: ప్రధాని మోదీ
    'వికసిత్ భారత్'లో ఆరెస్సెస్‌ పాత్ర కీలకం: ప్రధాని మోదీ

    PM Modi: 'వికసిత్ భారత్'లో ఆరెస్సెస్‌ పాత్ర కీలకం: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 30, 2025
    05:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS)ను భారత అజరామర సంస్కృతికి మహావృక్షంగా అభివర్ణించారు.

    ప్రధానిగా పదవి చేపట్టిన 11 ఏళ్ల తర్వాత, తొలిసారి ఆయన నాగ్‌పుర్‌లోని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.

    ముందుగా హెడ్గేవార్‌ స్మృతి మందిరానికి వెళ్లి, ఆరెస్సెస్‌ వ్యవస్థాపకుడు కేశవ బాలిరాం హెడ్గేవార్, రెండో సర్‌సంఘ్‌చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్‌లకు నివాళులర్పించారు.

    అనంతరం 1956లో డా. బీఆర్ అంబేడ్కర్‌ బౌద్ధమతాన్ని స్వీకరించిన 'దీక్షభూమి'ను దర్శించారు. అదనంగా, మాధవ్‌ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.

    Details

    సేవకు పర్యాయపదం ఆరెస్సెస్

    భారత సంస్కృతి, ఆధునికీకరణకు ఆరెస్సెస్‌ మర్రిచెట్టులాంటిది. ఈ సంస్థ సేవకు పర్యాయపదం. సంఘ్‌ కార్యకర్తలు వివిధ రంగాల్లో నిస్వార్థంగా పనిచేస్తున్నారు.

    గత వందేళ్లలో ఆరెస్సెస్‌ చేసిన తపస్సు.. దేశం 'వికసిత్ భారత్' దిశగా సాగుతున్న తరుణంలో ఫలాలు ఇస్తోందని ఆయన ప్రధాని మోదీ కొనియాడారు.

    రాజ్యాంగానికి 75 ఏళ్ల వేడుక వేళ.. ఆరెస్సెస్‌ వందేళ్లు పూర్తి చేసుకుంటోందని పేర్కొన్నారు. సంఘ్‌ చీఫ్‌ మోహన్ భాగవత్ మాట్లాడుతూ, నిస్వార్థ సేవ తమ సిద్ధాంతమని తెలిపారు.

    ప్రజలకు సరైన ఆరోగ్య సౌకర్యాలు అందించాలన్న ఉద్దేశంతో మాధవ్ నేత్రాలయలో ఆరెస్సెస్‌ వాలంటీర్లు పేదలకు సేవలు అందిస్తున్నారని వెల్లడించారు.

    Details

    చివరిసారిగా 2017లో సందర్శించిన మోదీ

    బీఆర్ అంబేడ్కర్‌ 'దీక్షభూమి'ను సామాజిక న్యాయం, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించే చిహ్నంగా ప్రధాని మోదీ అభివర్ణించారు.

    రాజ్యాంగ నిర్మాత కలలుగన్న దేశాన్ని సాకారం చేసేందుకు మరింత కృషి చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు.

    అభివృద్ధి చెందిన, సంఘటిత భారత్‌ను నిర్మించడమే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అని తెలిపారు. మోదీ చివరిసారిగా 2017లో దీక్షభూమిని సందర్శించారు.

    అటల్ బిహారీ వాజ్‌పేయీ అనంతరం, ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రెండో సిట్టింగ్‌ ప్రధానిగా మోదీ నిలిచారు.

    నాగ్‌పుర్‌లోని 'సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్' మందుగుండు సామగ్రి కేంద్రాన్నీ ఆయన పరిశీలించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఇండియా

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    నరేంద్ర మోదీ

    Threat Call: మోదీ విదేశీ పర్యటనకు ఉగ్ర బెదిరింపులు..  ముంబయి పోలీసులకు బెదిరింపు కాల్‌   భారతదేశం
    US-France Visit: మార్సెయిల్‌లో భారత నూతన కాన్సులేట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  అంతర్జాతీయం
    PM Modi:అమెరికాలో మోదీకి ఘన స్వాగతం.. ఎలాన్ మస్క్‌తో కీలక చర్చలు? ఎలాన్ మస్క్
    PM Modi: బ్లేయర్ హౌస్‌లో మోదీ బస.. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? అమెరికా

    ఇండియా

    #NewsBytesExplainer: దేశాధినేతల మధ్య చెలరేగిన ఘర్షణలు.. చరిత్రలో నిలిచిపోయిన మాటల యుద్ధాలివే! అమెరికా
    Mayawati: మేనల్లుడికి మాయావతి షాక్‌.. ఆకాశ్‌ను పార్టీ బాధ్యతల నుంచి తొలగింపు  మాయావతి
    Mohan Yadav: మధ్యప్రదేశ్ రైతులకు శుభవార్త.. రూ.5కే శాశ్వత విద్యుత్‌ కనెక్షన్‌ మధ్యప్రదేశ్
    TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు రంగం సిద్ధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025