NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rishikonda Beach: బ్లూఫ్లాగ్ గుర్తింపు సాధించిన రుషికొండ బీచ్.. మంత్రి దుర్గేష్ హర్షం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rishikonda Beach: బ్లూఫ్లాగ్ గుర్తింపు సాధించిన రుషికొండ బీచ్.. మంత్రి దుర్గేష్ హర్షం
    బ్లూఫ్లాగ్ గుర్తింపు సాధించిన రుషికొండ బీచ్.. మంత్రి దుర్గేష్ హర్షం

    Rishikonda Beach: బ్లూఫ్లాగ్ గుర్తింపు సాధించిన రుషికొండ బీచ్.. మంత్రి దుర్గేష్ హర్షం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 23, 2025
    05:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై హర్షం వ్యక్తం చేశారు.

    అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆయన తెలిపారు. రుషికొండ బీచ్ పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు కృషి చేసి, బ్లూఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు.

    ఈ పునరుద్ధరణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని, తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని సాధించామని చెప్పారు.

    Details

     పునరుద్ధరణకు విశేష కృషి చేసిన అధికారులకు ధన్యవాదాలు

    పర్యాటక శాఖ అధికారులను సమర్థంగా మార్గదర్శనం చేయడంతోపాటు, విశాఖపట్నం కలెక్టర్ హరేంద్రీ ప్రసాద్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పోలీస్, అటవీ శాఖల అధికారుల సహకారంతో ఈ ఘనత సాధించగలిగామని మంత్రి దుర్గేష్ వివరించారు.

    బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ పునరుద్ధరణకు విశేష కృషి చేసిన అధికారులందరికీ ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

    రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ హోదా పునరుద్ధరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం కీలక పాత్ర పోషించారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

    ఈ ఇద్దరు నేతలకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

    Details

    రుషికొండ బీచ్ అభివృద్ధికి మరింత కృషి

    భారతదేశంలో బ్లూఫ్లాగ్ హోదా పొందిన తొలి ఎనిమిది బీచ్‌లలో రుషికొండ బీచ్ ఒకటిగా నిలిచిందని మంత్రి తెలిపారు.

    ఈ బీచ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్లీన్, సేఫ్, ఎకో-ఫ్రెండ్లీ బీచ్‌గా గుర్తింపు పొందడం విశాఖపట్నం గర్వించదగిన విషయమని అన్నారు.

    రుషికొండ బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేసి, ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Jammu Kashmir: డ్రోన్‌లతో మళ్లీ విరుచుకపడ్డ పాక్.. పలు జిల్లాలో బ్లాక్ అవుట్ జమ్ముకశ్మీర్
    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్ భారతదేశం
    PM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష నరేంద్ర మోదీ
    Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు బాంబు బెదిరింపు

    ఆంధ్రప్రదేశ్

    Active Andhra: క్రీడల ప్రోత్సాహానికి విద్యాశాఖ నూతన ప్రణాళిక.. 'యాక్టివ్ ఆంధ్ర' పేరుతో క్రీడా శిక్షణ ఇండియా
    AP Assembly: ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్య ప్రచారం.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు వైసీపీ
    Naga Babu: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం! జనసేన
    Summer: మార్చి మొదటి వారంలోనే వడగాలుల దడ.. రాష్ట్రంలో 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025