NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sabarimala Ayyappa Temple: నేడు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే! 
    తదుపరి వార్తా కథనం
    Sabarimala Ayyappa Temple: నేడు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే! 
    Sabarimala Ayyappa Temple: నేడు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే!

    Sabarimala Ayyappa Temple: నేడు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే! 

    వ్రాసిన వారు Stalin
    Dec 27, 2023
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    Sabarimala Ayyappa Temple: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.

    ఆలయం తెరిచిన 5 వారాల్లోనే దేవస్థానానికి ఏకంగా రూ.200 కోట్ల ఆదాయం వచ్చిందంటే.. భక్తులు ఏ స్థాయిలో వచ్చారో అర్థం చేసుకోవచ్చు.

    ఈ క్రమంలో బుధవారం రాత్రి 11గంటలకు మూసివేస్తున్నట్లు ట్రావెన్‌కోర్‌ బోర్డ్‌ అధికారులు ప్రకటించారు.

    బుధవారంతో 41రోజుల మండల పూజ ముగుస్తుందని, అందుకే ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు.

    ఆలయాన్ని మళ్లీ 'మకరవిళక్కు' పూజల కోసం ఈ నెల 30వ తేదీన.. సాయంత్రం 5గంటలకు తెరవనున్నారు.

    జనవరి 15న సాయంత్రం 6 గంటల 36 నిమిషాల 45 సెకన్లకు జ్యోతి దర్శనం ఉంటుందని ట్రావెన్‌కోర్‌ బోర్డ్‌ పేర్కొంది.

    శబరిమల

    39రోజుల్లో శబరిమలను దర్శించుకున్న 31,43,163 మంది భక్తులు 

    జ్యోతి దర్శనం తర్వాత శబరిమల ఆలయాన్ని జనవరి 20వ తేదీన మూసివేయనున్నారు.

    అనంతరం అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతించరు. దీంతో ఈ ఏడాదికి శబరిమల యాత్రా సీజన్‌ ముగిసినట్లు భావించాలి.

    ఇదిలా ఉంటే, మండల పూజ ముగింపు ఉత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది.

    ఈ సీజన్‌లో శబరిమలకు భక్తులు రికార్డు స్థాయిలో వచ్చారు.

    ఆలయం తెరిచిన కేవలం 39రోజుల్లో దేవస్థానానికి రూ.204.30 కోట్ల ఆదాయం వచ్చింది. 31,43,163 మంది భక్తులు దర్శించుకున్నారు.

    ఇందులో నాణేల ద్వారా రూ.63.89కోట్లు.. ప్రసాదం విక్రయంతో వల్ల రూ.96.32కోట్లు.. అప్పం ప్రసాదం అమ్మడం ద్వారా రూ.12.38కోట్ల ఆదాయం వచ్చింది.

    ఇక 41 రోజుల ఆదాయం లెక్కిస్తే.. ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శబరిమల
    తాజా వార్తలు
    ఆలయం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    శబరిమల

    అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త.. శబరిమల స్పెషల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఆమోదం అయ్యప్ప
    South Central Railway: శబరిమల భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు  దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    Sabarimala special trains: ఏపీ, తెలంగాణ మీదుగా శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు  దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తాజా వార్తలు

    కొత్తగా ఎన్నికైన WFI ఎగ్జిక్యూటివ్‌ బాడీని సస్పెండ్ చేసిన కేంద్రం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా
    Ram charan: క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన రామ్ చరణ్  రామ్ చరణ్
    IIT Kanpur: స్టేజిపై మాట్లాడుతూ.. కన్నుమూసిన ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ ఉత్తర్‌ప్రదేశ్
    'Salaar' day 2 collections: 'సలార్' 2వ రోజు కలెక్షన్లు ఎంతంటే?  సలార్

    ఆలయం

    270 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్‌ ఆలయ నిర్మాణం ప్రారంభం  బిహార్
    దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు  రిషి సునక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025