Sabitha Indrareddy: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మానవత్వం.. నెట్టింట వైరల్
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన మంచి మనసును చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి చేయూతనందించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని రేణుక ఎల్లమ్మను మంగళవారం దర్శించుకున్న సబిత తుక్కుగూడ వైపుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో రోడ్డుపై ఓ వ్యక్తి ఫీట్స్ వచ్చి కిందపడ్డాడు. ఇది గమనించిన సబిత తన వాహనాన్ని ఆపారు. తన సిబ్బంది సాయంతో ఫీట్స్ వచ్చిన వ్యక్తిని మామూలు స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అతని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అతనికి కొంత నగదు సాయం చేసి, ఆటో ఎక్కించి, అతని స్వగ్రామానికి పంపారు. సబితా ఇంద్రారెడ్డి చేసిన సాయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.