NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nandini Milk: కర్ణాటకలో నందిని పాల ధరలకు షాక్‌.. లీటరుకు ఎంత పెరిగిందంటే?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Nandini Milk: కర్ణాటకలో నందిని పాల ధరలకు షాక్‌.. లీటరుకు ఎంత పెరిగిందంటే?
    కర్ణాటకలో నందిని పాల ధరలకు షాక్‌.. లీటరుకు ఎంత పెరిగిందంటే?

    Nandini Milk: కర్ణాటకలో నందిని పాల ధరలకు షాక్‌.. లీటరుకు ఎంత పెరిగిందంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 27, 2025
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల (Nandini Milk) ధరలను లీటరుకు రూ.4 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

    కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్ (Karnataka Milk Federation - KMF), రైతు సంఘాల డిమాండ్ మేరకు సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    ముందుగా లీటరుకు రూ.5 పెంచాలని ప్రతిపాదించగా, చివరకు రూ.4 పెంపు నిర్ణయించింది. తాజా నిర్ణయంతో ఒక లీటరు నందిని పాల ప్యాకెట్ (ప్రముఖ బ్లూ ప్యాకెట్) ధర రూ.44 నుంచి రూ.48కి పెరగనుంది.

    Details

    తరచూ పెరుగుతున్న నందిని పాల ధరలు 

    కేఎమ్‌ఎఫ్‌ గతంలోనూ పాల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. చివరిసారిగా జూన్ 2024లో లీటరుకు రూ.2 పెంచగా, ఆందుకు ముందు జులై 2023లో రూ.3 పెంచింది.

    ఈసారి ఏకంగా రూ.4 పెంపు నిర్ణయించడం గమనార్హం.

    నిత్యావసరాల ధరల పెరుగుదల

    పాల ధరల పెంపుతోపాటు, కర్ణాటక ప్రజలు ఇప్పటికే మరిన్ని ధరల భారాన్ని ఎదుర్కొంటున్నారు.

    కాఫీ పౌడర్ ధరలు: కాఫీ బ్రూవర్ల సంఘం ప్రకారం, మార్చి నాటికి కిలోకు రూ.200 పెరుగనున్నాయి.

    Details

    బీఎంటీసీ బస్సులు, నమ్మ మెట్రో ఛార్జీలు 

    బస్సు, మరియు మెట్రో టికెట్ ఛార్జీలు ఇప్పటికే పెరిగాయి.

    నీటి సుంకం

    రాష్ట్ర ప్రభుత్వం నీటి సుంకాన్ని పెంచేందుకు పరిశీలిస్తోంది.

    విద్యుత్ ఛార్జీలు

    ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ వినియోగదారులకు అదనంగా 36 పైసలు యూనిట్‌కు సర్‌చార్జి విధించనున్నారు.

    విద్యుత్తు సరఫరా కంపెనీలను (ఎస్కామ్స్‌) కర్ణాటక విద్యుత్తు నియంత్రణ కమిషన్‌ (కేఈఆర్‌సీ) ఆదేశించింది.

    ప్రజలకు భారం

    నిత్యావసర వస్తువుల నుంచి నీరు, విద్యుత్ ఛార్జీలు, బస్సు, మెట్రో ఛార్జీల పెంపుతో ప్రజలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాల ధరల పెంపు మరింత భారంగా మారనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    కర్ణాటక

    Karnataka: కర్ణాటకలో ఔరంగజేబ్ బ్యానర్ల కలకలం.. స్థానికంగా ఉద్రిక్తత పెంచిన ఘటన.. భారతదేశం
    CM Siddaramaiah: ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసుల ఎదుట హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  సిద్ధరామయ్య
    No Smoking: ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రాంగణాలలో సిగరెట్లు తాగడం నిషేధం భారతదేశం
    Tejasvi Surya: కర్ణాటక హవేరీ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025