
New Courses: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటర్ లోనే బీటెక్ సబ్జెక్ట్స్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ స్థాయినుంచి బీటెక్కు సంబంధించిన సబ్జెక్టులను విద్యార్థులకు బోధించడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటివరకు బీటెక్ కోర్సుల్లో మాత్రమే ఉంటున్న క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డాటా అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లర్నింగ్ (ఏఐఎంఎల్), బయోమెడికల్ ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టులను ఇక నుంచి ఇంటర్ స్థాయిలో నేర్పించేలా నిర్ణయం తీసుకున్నారు.
రాబోయే 2025-26 విద్యాసంవత్సరానికి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది.
ఈ కింద భాగంగా ఆరు కొత్త కోర్సులను ఇంటర్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళిక ఉంది.
2025-26 సంవత్సరంలో ఇంటర్ విద్యా కమిషనరేట్ అధికారులు ముందుగా జూనియర్ కాలేజీల్లో ఈ కోర్సుల ప్రవేశాన్ని ప్రారంభించనున్నారు.
వివరాలు
కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞాన మార్పులు
ఉదాహరణకు, కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డాటా అనాలిసిస్ కోర్సులు,నల్లగొండ ప్రభుత్వ వొకేషనల్ కాలేజీలో బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫలక్నుమా ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లర్నింగ్, మహబూబ్నగర్ ప్రభుత్వ వొకేషనల్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, హైదరాబాదులో బజార్ఘాట్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీలో సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, హనుమకొండ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు నిర్ణయించారు.
కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞాన మార్పులు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
కొత్త కోర్సుల సబ్జెక్టులపై ముందే అవగాహన
సాంకేతికంగా ఎంత ముందు వెళుతున్నా ఇంకా పాత సబ్జెక్టులనే విద్యార్థులకు బోధించడం సరికాదని,ఇంటర్ స్థాయినుంచి టెక్నికల్ విద్య అందించడం ద్వారా వారికి ముందుగానే పునాది పటిష్టం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈకొత్త కోర్సుల వల్ల విద్యార్థులకు బీటెక్ లో ఇంతవరకు తెలియని సబ్జెక్టులపై ముందే అవగాహన ఏర్పడుతుంది.
నేటి పరిస్థితుల్లో,బీటెక్లోకి చేరినప్పుడు విద్యార్థులు చాలా సబ్జెక్టులను కొత్తగా నేర్చుకోవాల్సి రావడం భారంగా మారుతుండటం నిజం.
అందుకే బీటెక్ కోర్సుల కీలక అంశాలను ఇంటర్ నుండి పరిచయం చేయడం విద్యార్థులకే ప్రయోజనకరం.
ఇంటర్ విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పవచ్చు.సర్కార్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో,వారి విద్యాభ్యాసంలో ఏ విధంగా మార్పులు వస్తాయో చూడాలి.