గోదావరి ఎక్స్ప్రెస్తోపాటు 14రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
ట్రాక్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ గురువారం ప్రకటించింది. అలాగే కొన్ని రైలు సర్వీసులను రీషెడ్యూల్ చేసినట్లు వెల్లడించింది. తాడి- అనకాపల్లి రూట్లో రాజుపాలెం వద్ద గూడ్స్ రైలు బుధవారం పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దెబ్బతిన్న ట్రాక్ను సరి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రబాద్- వైజాగ్ గోదావరి ఎక్స్ ప్రెస్ రైలును గురువారం, శుక్రవారం రద్దు చేశారు. విశాఖ నుంచి వచ్చే గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు 16, 17వ తేదీల్లో ఈ రైలు సర్వీసు అందుబాటులో ఉండదు. ఇలా రద్దు చేసిన, రీషెడ్యూల్ చేసిన ట్రైన్ సర్వీసులను ట్విట్టర్లో షేర్ చేసింది.