Page Loader
Southwest monsoon: రెండు రోజుల్లో దేశమంతా నైరుతి రుతుపవనాల జోరు
రెండు రోజుల్లో దేశమంతా నైరుతి రుతుపవనాల జోరు

Southwest monsoon: రెండు రోజుల్లో దేశమంతా నైరుతి రుతుపవనాల జోరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి రుతుపవనాలు వచ్చే రెండు, మూడు రోజుల్లో దేశమంతా విస్తరించనున్నాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. పశ్చిమమధ్య, సరిహద్దు వాయవ్య బంగాళాఖాతం సహా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాల సూచన ఉన్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా, సముద్రం అలజడిగా మారే అవకాశాలున్నందున మంగళవారం మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.