NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamilnadu: బిల్లులను క్లియర్ చేయడం లేదంటూ గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన స్టాలిన్ ప్రభుత్వం 
    తదుపరి వార్తా కథనం
    Tamilnadu: బిల్లులను క్లియర్ చేయడం లేదంటూ గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన స్టాలిన్ ప్రభుత్వం 
    Tamilnadu: బిల్లులను క్లియర్ చేయడం లేదంటూ గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన స్టాలిన్ ప్రభుత్వం

    Tamilnadu: బిల్లులను క్లియర్ చేయడం లేదంటూ గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన స్టాలిన్ ప్రభుత్వం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 31, 2023
    10:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చేసిన అభ్యర్థనలో, రాష్ట్ర అసెంబ్లీ పంపుతున్న బిల్లులు, ఉత్తర్వులను గవర్నర్ సకాలంలో ఆమోదించడం లేదని పేర్కొంది.

    54 మంది ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన పన్నెండు బిల్లులు, నాలుగు ప్రాసిక్యూషన్ ఆంక్షలు, ఫైళ్లు ప్రస్తుతం గవర్నర్ రవి ముందు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

    గవర్నర్ ప్రజల అభీష్టాన్ని దెబ్బతీశారని,గవర్నర్ పదవిని దుర్వినియోగం చేశారని ప్రభుత్వం ఆరోపించింది.

    Details 

    తమిళనాడుకు బదులుగా 'తమిళగం'

    ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 4న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రం పేరుపై చర్చ మొదలైంది.

    తమిళనాడులో దురదృష్టవశాత్తు తిరోగమన రాజకీయాలు ఉన్నాయన్న ఆయన, దేశం మొత్తానికి వర్తించే ప్రతిదాన్ని గుడ్డిగా తిరస్కరించే అలవాటు పెరిగిందన్నారు.

    తమిళనాడుకు బదులుగా'తమిళగం'అని పేరు మారిస్తే సముచితమైన పదం అవుతుందని ఆయన అన్నారు. దీని పై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది.

    గవర్నర్‌ తనపై వస్తున్న వ్యతిరేక వాదనలకు ముంగింపు పలికేలా వివరణ కూడా ఇచ్చారు. 'తమిళగం' అంటే 'తమిళుల ఇల్లు' అని అర్థమని 'నాడు' అంటే 'భూమి', భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాన్ని వర్ణించడానికి ఈ పదాన్ని వాడాలని చాలమంది భావిస్తున్నారని తాను చెప్పదలచానని గవర్నర్ తెలిపారు.

    Details 

    అసెంబ్లీ సమావేశాల నుంచి  గవర్నర్ వాకౌట్ 

    ఆ తర్వాత, జనవరిలోనే, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ ప్రసంగంలోని పలు అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

    దీంతో గవర్నర్ ఆర్‌ఎన్ రవి అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తమిళనాడు

    సీబీఐకి షాకిచ్చిన సీఎం స్టాలిన్; అనుమతులుంటేనే తమిళనాడులోకి ఎంట్రీ సీబీఐ
    తమిళనాడులో భారీ వర్షాలు; పాఠశాలలు మూసివేత ఐఎండీ
    ఆమె ఎంతోమంది షర్మిలలను సృష్టించాలి.. అందుకే కారును గిఫ్ట్‌గా ఇస్తున్నానన్న కమల్‌ హాసన్ కమల్ హాసన్
    తమిళనాడు గవర్నర్ అర్ధరాత్రి ఉత్తర్వులు.. సెంథిల్ బాలాజీ మంత్రిగా కొనసాగుతారని నిర్ణయం గవర్నర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025