TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల..11 అసెంబ్లీలకు,13 ఎంపీ అభ్యర్థులను ప్రకటన
ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 11ఎమ్యెల్యే , 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. టిడిపి-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా మొత్తం 175అసెంబ్లీ స్థానాలకు గాను 144 స్థానాలలో టీడీపీ పోటీ చేయనుంది. ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను 17 ఎంపీ స్థానాలలో టీడీపీ పోటీ చేస్తోంది. పలాస- గౌతు శిరీష, పాత పట్నం- గోవిందరావు, శ్రీకాకుళం- గోండు శంకర్, Sకోట- కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ- వెంకటేశ్వరరావు, అమలాపురం-ఆనందరావు, పెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-కృష్ణ ప్రసాద్, నరసరావుపేట-అరవింద్బాబు, చీరాల- మాలకొండయ్య, సర్వేపల్లి-సోమిరెడ్డి.