
TS Govt: తెలంగాణ బీసీ రిజర్వేషన్.. ఇవాళ సుప్రీం కోర్టు ముందు ఎస్ఎల్పీ వేయనున్న ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఈరోజు స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) వేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే న్యాయ నిపుణుల సూచనల ప్రకారం అధికారులు సిద్ధంగా ఉంచారు. ఈ అంశంపై సీఎం ఏజీ సుదర్శన్ రెడ్డి, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో చర్చించారు.
Details
ప్రభుత్వ వాదనను బలపరిచేందుకు ఏర్పాట్లు
హైకోర్టు తీర్పు ప్రతితో పాటు, అవసరమైన ఇతర పత్రాలను తెలంగాణ అధికార వర్గాలు ఢిల్లీకి పంపారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు ఎస్ఎల్పీ దాఖలు చేస్తున్నారు. సుప్రీం తీర్పు కీలకం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్తు ఆధారపడి ఉంది. పిటిషనర్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లను సవాల్ చేసి స్టే పొందిన పిటిషనర్ మాధవ రెడ్డి, గత శుక్రవారమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేసిన తర్వాత, పిటిషనర్ తమ వాదనలను వినాకే సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.