NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana Cabinet expansion: నేడే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. ముగ్గురికి పదవులు ఖాయం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana Cabinet expansion: నేడే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. ముగ్గురికి పదవులు ఖాయం!
    నేడే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. ముగ్గురికి పదవులు ఖాయం!

    Telangana Cabinet expansion: నేడే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. ముగ్గురికి పదవులు ఖాయం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 08, 2025
    09:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు వేదిక ఫిక్సయింది.

    ఆదివారం మధ్యాహ్నం 12:00 నుండి 12:20 గంటల మధ్య ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందులో బీసీల నుంచి వి. శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్‌ (మాల) అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (మాదిగ)లకు మంత్రిపదవులు లభించనున్నాయి.

    శాసనసభ ఉప సభాపతిగా రామచంద్రునాయక్‌ నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విస్తరణలో సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేలా అధిష్ఠానం స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చింది.

    అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    ఇప్పటికే విస్తరణలో సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు చర్చకు వచ్చినప్పటికీ, సామాజిక సమతుల్యత దృష్టిలో ఉంచుకుని ఈ దఫా వారిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

    Details

    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్!

    ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ, కేంద్ర అధిష్ఠానం కొంత వెనుకంజ వేసినట్లు సమాచారం.

    ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మంత్రి చేస్తే, ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డిని కొనసాగించడం కష్టమవుతుందనే కారణంతో ఇద్దరిలో ఒకరినే ఎంపిక చేయాలన్న అధిష్ఠానం సూచింది.

    మంత్రివర్గ విస్తరణకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో అధిష్ఠానం చర్చలు జరిపింది.

    అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని శనివారం తుది అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.

    Details

    చీఫ్ విప్ పదవి భర్తీపై కూడా చర్చలు

    సీఎం అనంతరం పలువురు నేతలతో చర్చించి ముగ్గురు పేర్లపై స్పష్టతకు వచ్చారు. ప్రస్తుతం మంత్రివర్గంలో మూడు ఖాళీలను భర్తీ చేయగా, మరో మూడు స్థానాలు ఇంకా మిగిలి ఉన్నాయి.

    చీఫ్‌ విప్‌ పదవి భర్తీపై కూడా పార్టీ చర్చిస్తోంది. బీసీ వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్‌ ప్రస్తుతం విప్‌గా ఉన్నారు.

    గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదన్న కారణంగా వికారాబాద్‌ ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్‌కు మంత్రిపదవి, అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

    ఇక మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఒకరికి చీఫ్‌ విప్‌ పదవి ఇచ్చే మార్గాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది.

    Details

    సామాజిక న్యాయానికి అనుగుణంగా విస్తరణ

    మీనాక్షి నటరాజన్ నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరిపిన నేపథ్యంలో సామాజిక న్యాయానికి అనుగుణంగా విస్తరణ ఉండాలన్న అభిప్రాయాన్ని అధిష్ఠానానికి తెలిపారు.

    అంతేకాకుండా, ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ పేరొందిన నేపథ్యంలో, మాదిగ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేలు సీఎం నివాసానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు.

    అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వేముల వీరేశం, సామేల్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్యలు సీఎంను కలిసి తమ వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

    గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదన్న ఆక్రోశం, మంత్రివర్గంలో తప్పనిసరిగా చోటు ఇవ్వాలన్న డిమాండ్ నేపథ్యంలో ఈ వర్గానికి ప్రాధాన్యత లభించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Telangana Cabinet expansion: నేడే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. ముగ్గురికి పదవులు ఖాయం! తెలంగాణ
    India vs America: అమెరికా 10% సుంకాన్ని ఉపసంహరించకపోతే ప్రతీకార చర్యలు తప్పవు : భారత్ అమెరికా
    Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం.. ప్రచార సభలో కాల్పులు కొలంబియా
    Lalithaa Jewellery: రూ.1700 కోట్లతో స్టాక్ మార్కెట్‌లోకి లలితా జువెలరీ.. తొలిసారిగా ఐపీఓ దిశగా అడుగులు ఐపీఓ

    తెలంగాణ

    Telangana: ప్రజాపాలనలో రేషన్ కార్డు అప్లై చేసారా? స్టేటస్ చెక్ చేసుకునే మార్గం ఇదే! భారతదేశం
    Miss world 2025: శిల్పకళా వేదికగా మిస్‌ వరల్డ్‌ టాలెంట్‌ ఫినాలేలో 24 దేశాల అందగత్తెలు పోటీ భారతదేశం
    Miss World 2025 : హెడ్-టు-హెడ్ ఛాలెంజ్‌లో 20 మంది ఫైనలిస్టులు ఎంపిక భారతదేశం
    Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు భారత వాతావరణ శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025