Telangana Elections 2023: తెలంగాణలో బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తాం: కిషన్ రెడ్డి
తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును'భాగ్యనగర్'గా మారుస్తామని కేంద్రమంత్రి,బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మద్రాసు,బొంబాయి,కలకత్తా వంటి నగరాల పేర్లను మార్చినట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును'భాగ్యనగర్'గా మారుస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఇప్పటికే ధృవీకరించారని చెప్పారు. భాగ్యనగరం అంటే అదృష్ట నగరం అన్న ఆయన హైదరాబాద్ పేరును ఎందుకు మార్చకూడదు? అంటూ ప్రశ్నించారు. హైదర్ ఎవరు?మనకు హైదర్ పేరు అవసరమా?హైదర్ ఎక్కడి నుంచి వచ్చాడు?ఎవరికి హైదర్ కావాలి అని అడిగారు. నిజాం హయాంలో పేరు భాగ్యనగరాన్నిహైదరాబాద్ గా మార్చారు. బీజీపీ అధికారంలోకి రాగానే మళ్లీ భాగ్యనగరం అని పేరు పెడతామని అన్నారు.