NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: జూన్‌ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు.. పౌరసరఫరాల సంస్థ నిర్ణయం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: జూన్‌ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు.. పౌరసరఫరాల సంస్థ నిర్ణయం
    జూన్‌ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు.. పౌరసరఫరాల సంస్థ నిర్ణయం

    Telangana: జూన్‌ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు.. పౌరసరఫరాల సంస్థ నిర్ణయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 10, 2025
    12:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రబీ (యాసంగి) కాలానికి చెందిన వడ్లను రైతుల నుంచి జూన్‌ నెలాఖరుకల్లా సేకరించాలని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది.

    ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,209 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది.

    జిల్లాల వారీగా ధాన్యోత్పత్తిని దృష్టిలో పెట్టుకొని కేంద్రాల సంఖ్యను నిర్ణయించారు.

    వరి కోతలు ప్రారంభమైన ప్రాంతాల్లో ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు సంస్థ అధికారులు వెల్లడించారు.

    ఈ మంగళవారం నాటికి 1,838 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

    ఇప్పటికే రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 9వ తేదీ వరకు మొత్తం 95,131 టన్నుల వరి కొనుగోలు చేశారు.

    వివరాలు 

    అదనపు బోనస్‌ మొత్తం రూ.4.99 కోట్లు

    ఇందులో 9,973 టన్నుల దొడ్డు రకం ధాన్యం కాగా, మిగిలిన 85,158 టన్నులు సన్న రకం వరి.

    ఇప్పటివరకు ఈ వడ్లకు కట్టబెట్టిన ఎంఎస్‌పీ మొత్తం విలువ రూ.220.70 కోట్లు కాగా, అందులో రూ.46.54 కోట్లను ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశారు.

    రైతుల నుంచి సేకరించిన సన్న రకం వరికి ప్రభుత్వం ఇచ్చే అదనపు బోనస్‌ మొత్తం రూ.4.99 కోట్లుగా ఉంది.

    అయితే, ఈ చెల్లింపులు ఇంకా ప్రారంభించాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాలకు చేరిన మొత్తం ధాన్యంలో 92,724 టన్నులను ఇప్పటికే మిల్లులకు తరలించగా, మరో 2,407 టన్నులు కేంద్రాల్లోనే ఉన్నాయి.

    వివరాలు 

    ధాన్యం కొనుగోళ్లలో ముందుండే జిల్లాలు: నిజామాబాద్‌, నల్గొండ 

    రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కన్నా ముందుగా నిజామాబాద్‌,నల్గొండ జిల్లాల్లో వరి సాగు, కోతలు మొదలవుతాయి.

    అందువల్ల ఈ జిల్లాలు ధాన్యం కొనుగోళ్లలోనూ ముందున్నాయి. రాష్ట్రంలోని 1,838 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతుండగా, ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే 464 కేంద్రాలు ఉన్నాయి.

    ఆ తర్వాతి స్థానంలో నల్గొండ ఉంది, ఇక్కడ 250 కేంద్రాలు పనిచేస్తున్నాయి.

    కామారెడ్డి జిల్లాలో 241 కేంద్రాలు, సిద్దిపేటలో 230 కేంద్రాలు ఈ సీజన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

    యాసంగి సీజన్‌ మొత్తం మీద రాష్ట్రంలో సుమారుగా 1.37 కోట్ల టన్నుల వరి దిగుబడి ఉండొచ్చని అంచనా వేసారు.

    ఇందులో నుంచి 70.13 లక్షల టన్నులను కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలంగాణ

    Telangana Floods: తెలంగాణలో వరదలకు కేంద్ర ప్రభుత్వ సాయం రూ.648 కోట్లు.. వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి  భారతదేశం
    Revanth Reddy: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిరోధానికి సిట్‌ ఏర్పాటు  భారతదేశం
    TS Assembly 2025: తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన? భట్టి విక్రమార్క
    Interest Waiver: తెలంగాణలో ఆస్తి పన్ను బకాయిలకు భారీ ఊరట.. 90శాతం వడ్డీ మాఫీ పన్ను
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025