NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / New Energy policy: తెలంగాణ కొత్త ఇంధన విధాన పత్రం విడుదలకు సిద్ధం.. ఎప్పుడంటే?
    తదుపరి వార్తా కథనం
    New Energy policy: తెలంగాణ కొత్త ఇంధన విధాన పత్రం విడుదలకు సిద్ధం.. ఎప్పుడంటే?
    తెలంగాణ కొత్త ఇంధన విధాన పత్రం విడుదలకు సిద్ధం.. ఎప్పుడంటే?

    New Energy policy: తెలంగాణ కొత్త ఇంధన విధాన పత్రం విడుదలకు సిద్ధం.. ఎప్పుడంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 07, 2025
    04:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన కొత్త ఇంధన విధాన పత్రాన్ని (న్యూ ఎనర్జీ పాలసీ) జనవరి 9న విడుదల చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

    సోమవారం, సచివాలయం ఎదురుగా నిర్వహించిన సమావేశంలో జెన్‌కో రాతపరీక్షల ద్వారా 315 సహాయ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు.

    గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఇంధన పాలసీని అందించడంలో విఫలమైందని విమర్శించారు.

    కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పలు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.

    ఈ క్రమంలో మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిన కొత్త ఇంధన విధానం అనేక అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రూపొందించామని తెలిపారు.

    Details

    రామగుండంలో థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు

    జెన్‌కో, సింగరేణి సంస్థ కాలరీస్‌ లిమిటెడ్‌ సంయుక్త భాగస్వామ్యంలో రామగుండంలో థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

    ఒడిశాలోని సింగరేణికి కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్‌ను పూర్తిగా వినియోగించుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని భట్టి వివరించారు.

    చదువుకున్న యువకుడికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని తెలిపారు.

    ఇక సింగరేణి ఆధ్వర్యంలో రూపొందించిన 'చెమట చుక్కలకు తర్ఫీదు' లోగోను భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.

    సింగరేణి కార్మికుల పిల్లలకు దేశ, విదేశాల్లో ఉన్నత విద్యా, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్‌అలీ పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    తెలంగాణ

    SEA Elections: సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా.. భారతదేశం
    Allu Arjun: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పై చర్యలు అల్లు అర్జున్
    Balagam Mogilaiah: 'బలగం' మొగిలయ్య కన్నుమూత సినిమా
    Allu Arjun: 'నాపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధగా ఉంది'.. అల్లు అర్జున్ అల్లు అర్జున్

    ఇండియా

    Narendra Modi: కువైట్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం నరేంద్ర మోదీ
    Delhi: చలి తీవ్రతతో దిల్లీ గజగజ.. రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం దిల్లీ
    ED: కెనడా కాలేజీలపై మానవ అక్రమ రవాణా ఆరోపణలు.. ఈడీ దర్యాప్తు కెనడా
    Atal Bihari Vajpayee: అటల్‌ బిహారి వాజ్‌పేయీ జయంతి.. రూ.వంద నాణేన్ని ఆవిష్కరించిన మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025