తదుపరి వార్తా కథనం
Telangana: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్.. సైబర్ పోలీస్ హెచ్చరిక
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 23, 2025
03:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాకింగ్కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు `ఎస్బీఐ కేవైసీ` పేరుతో ఏపీకే ఫైల్స్ను ఈ గ్రూపుల్లో షేర్ చేస్తున్నట్లు సమాచారం. వారు వెంటనే ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మంత్రుల అధికారిక గ్రూపులు, సీఎంవో గ్రూప్, డిప్యూటీ సీఎం గ్రూప్ సహా మీడియా సంబంధిత గ్రూపులు కూడా హ్యాక్ అయ్యాయని తెలుస్తోంది. మంత్రుల పీఆర్వోలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని వార్తలు వెల్లడి చెందాయి.
Details
అనుమానాస్పద లింక్ లు ఓపెన్ చేయొద్దు
ఈ హ్యాకింగ్ సంఘటన సోషల్ మీడియా ద్వారా వైరల్గా మారింది. ప్రచారం కారణంగా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఓపెన్ చేయవద్దని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని వారు హెచ్చరించారు.