NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'ఆ దగ్గు సిరప్ తయారీని నిలిపేశాం'.. ఉజ్బెకిస్తాన్‌‌లో పిల్లల మరణాలపై స్పందించిన కేంద్రం
    తదుపరి వార్తా కథనం
    'ఆ దగ్గు సిరప్ తయారీని నిలిపేశాం'.. ఉజ్బెకిస్తాన్‌‌లో పిల్లల మరణాలపై స్పందించిన కేంద్రం
    దగ్గు సిరప్ తయారు చేసి ఫార్మాకంపెనీపై విచారణ

    'ఆ దగ్గు సిరప్ తయారీని నిలిపేశాం'.. ఉజ్బెకిస్తాన్‌‌లో పిల్లల మరణాలపై స్పందించిన కేంద్రం

    వ్రాసిన వారు Stalin
    Dec 29, 2022
    05:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ఔషధ సంస్థ తయారు చేసిన దగ్గు సిరప్ తాగి తమ దేశంలో 18మంది చనిపోయారని ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ ప్రకటించిన నేపథ్యంలో.. కేంద్రం స్పందించింది. ఈ విషయంలో ఉజ్బెకిస్థాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విచారణ జరుపుతున్నట్లు.. ఇప్పటికే దగ్గు సిరప్ తయారీని నిలిపివేసినట్లు తెలిపింది.

    ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ ఆరోపిస్తున్న డాక్ -1 మాక్స్ దగ్గు సిరప్ నమూనాలను చండీగఢ్‌లోని రీజనల్ డ్రగ్స్ టెస్టింగ్ లాబొరేటరీకి పరీక్షల కోసం పంపినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

    ఉజ్బెకిస్తాన్

    సిరప్‌లో 'ఇథిలీన్ గ్లైకాల్'..

    డాక్ -1 మాక్స్ దగ్గు సిరప్‌ను ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా తమ ల్యాబ్‌లో పరీక్షించింది. సిరప్‌లో ప్రమాదకర ' ఇథిలీన్ గ్లైకాల్' ఉన్నట్లు ఉజ్బెకిస్తాన్ చెబుతోంది. అలాగే వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఫార్మసిస్ట్‌ల సలహా మేరకు పిల్లలకు ఎక్కువ మోతాదులతో సిరప్‌ను పిల్లలకు అందించినట్లు ఉజ్బెకిస్తాన్ వెల్లడించింది.

    పిల్లలు ఆసుపత్రిలో చేరే ముందు ఈ సిరప్‌ను 2-7 రోజుల పాటు ఇంట్లో 2.5 నుంచి 5 ఎంఎల్ మోతాదులో రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తీసుకున్నట్లు ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    PM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష నరేంద్ర మోదీ
    Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు బాంబు బెదిరింపు
    Red Cross Symbol: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆస్పత్రులపై 'రెడ్ క్రాస్' గుర్తులు తెలంగాణ
    Ministry of Foreign Affairs: 36 ప్రాంతాలలో 400 డ్రోన్లతో పాకిస్థాన్‌ దాడులు: విదేశాంగ మంత్రిత్వ శాఖ విదేశాంగశాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025