Page Loader
'ఆ దగ్గు సిరప్ తయారీని నిలిపేశాం'.. ఉజ్బెకిస్తాన్‌‌లో పిల్లల మరణాలపై స్పందించిన కేంద్రం
దగ్గు సిరప్ తయారు చేసి ఫార్మాకంపెనీపై విచారణ

'ఆ దగ్గు సిరప్ తయారీని నిలిపేశాం'.. ఉజ్బెకిస్తాన్‌‌లో పిల్లల మరణాలపై స్పందించిన కేంద్రం

వ్రాసిన వారు Stalin
Dec 29, 2022
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఔషధ సంస్థ తయారు చేసిన దగ్గు సిరప్ తాగి తమ దేశంలో 18మంది చనిపోయారని ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ ప్రకటించిన నేపథ్యంలో.. కేంద్రం స్పందించింది. ఈ విషయంలో ఉజ్బెకిస్థాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విచారణ జరుపుతున్నట్లు.. ఇప్పటికే దగ్గు సిరప్ తయారీని నిలిపివేసినట్లు తెలిపింది. ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ ఆరోపిస్తున్న డాక్ -1 మాక్స్ దగ్గు సిరప్ నమూనాలను చండీగఢ్‌లోని రీజనల్ డ్రగ్స్ టెస్టింగ్ లాబొరేటరీకి పరీక్షల కోసం పంపినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

ఉజ్బెకిస్తాన్

సిరప్‌లో 'ఇథిలీన్ గ్లైకాల్'..

డాక్ -1 మాక్స్ దగ్గు సిరప్‌ను ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా తమ ల్యాబ్‌లో పరీక్షించింది. సిరప్‌లో ప్రమాదకర ' ఇథిలీన్ గ్లైకాల్' ఉన్నట్లు ఉజ్బెకిస్తాన్ చెబుతోంది. అలాగే వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఫార్మసిస్ట్‌ల సలహా మేరకు పిల్లలకు ఎక్కువ మోతాదులతో సిరప్‌ను పిల్లలకు అందించినట్లు ఉజ్బెకిస్తాన్ వెల్లడించింది. పిల్లలు ఆసుపత్రిలో చేరే ముందు ఈ సిరప్‌ను 2-7 రోజుల పాటు ఇంట్లో 2.5 నుంచి 5 ఎంఎల్ మోతాదులో రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తీసుకున్నట్లు ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.