NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CRCS-Sahara Refund Portal: సహారా డిపాజిటర్ల రీఫండ్ కోసం పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం 
    తదుపరి వార్తా కథనం
    CRCS-Sahara Refund Portal: సహారా డిపాజిటర్ల రీఫండ్ కోసం పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం 
    సహారా డిపాజిటర్ల రీఫండ్ కోసం పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం

    CRCS-Sahara Refund Portal: సహారా డిపాజిటర్ల రీఫండ్ కోసం పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం 

    వ్రాసిన వారు Stalin
    Jul 18, 2023
    05:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సహారా గ్రూప్‌లోని 10 కోట్ల మంది డిపాజిటర్లు తమ డబ్బును 45 రోజుల్లో తిరిగి క్లెయిమ్ చేసుకునేందుకు 'సీఆర్‌సీఎస్- సహారా రీఫండ్ పోర్టల్'ను కేంద్ర సహకార మంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు.

    సహారా గ్రూప్‌లోని నాలుగు సహకార సంఘాల్లో చిక్కుకున్న డిపాజిటర్ల డబ్బును తిరిగి ఇచ్చే ప్రక్రియ సహారా రీఫండ్ పోర్టల్‌ను ప్రారంభించడాన్ని ఒక చారిత్రక సందర్భంగా షా పేర్కొన్నారు.

    4సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది డిపాజిటర్లకు తొమ్మిది నెలల్లోనే వారి డబ్బు తిరిగి వస్తుందని మార్చి 29న కేంద్రం హామీ ఇచ్చింది.

    ఆ తర్వాత సహారా-సెబీ రీఫండ్ ఖాతా నుంచి సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్(సీఆర్‌సీఎస్)కి రూ.5,000 కోట్లను బదిలీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

    అమిత్ షా

    తొలి దశలో రూ. 10,000 వరకు డిపాజిట్ చేసిన వారికి రీఫండ్

    సహార డిపాజిటర్లు తమ డబ్బును తిరిగి పొందేందుకు mocrefund.crcs.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.

    సహారా గ్రూపులో సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, సహారాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, హుమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనే నాలుగు సహకార సంఘాలు ఉన్నాయి.

    వీటిలో సుమారు 2.5 కోట్ల మంది రూ. 30,000 చొప్పున డిపాజిట్ చేశారు.

    మొదటి దశలో 5,000 కోట్ల రూపాయల కార్పస్‌తో రూ. 10,000 వరకు డిపాజిట్ చేసిన వారికి తిరిగి చెల్లిస్తామని అమిత్ షా చెప్పారు. వీరు 1.7 కోట్ల మంది ఉంటారని వెల్లడించారు.

    మిగిలిన వారికి తర్వాత చెల్లిస్తామని అమిత్ షా పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    తాజా వార్తలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ

    తాజా వార్తలు

    Rajasthan: పోలీసుల కళ్లల్లో కారం చల్లి, గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థులు  రాజస్థాన్
    Tomato: ఆ మూడు రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం  టమాట
    China: ప్రపంచంలోనే తొలిసారిగా మీథేన్ అంతరిక్ష రాకెట్‌ను ప్రయోగించిన చైనా చైనా
    Mamata Banerjee: పంచాయతీ ఎన్నికల హింసపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా: మమతా బెనర్జీ  మమతా బెనర్జీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025