NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు
    భారతదేశం

    మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు

    మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 11, 2023, 07:06 pm 1 నిమి చదవండి
    మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు
    అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు

    ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసులను ఆదేశించింది. సంక్రాంతి డ్రా పేరుతో వైసీపీ నాయకులు వసూళ్లకు పాల్పడినట్లు జనసేన నాయకులు ఆరోపించారు. అయితే ఈ వసూళ్ల పర్వం వైసీపీ నేత, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగినట్లు జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన గుంటూరు జిల్లా కోర్టు మంత్రిపై తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

    పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు: జనసేన

    'సంక్రాంతి డ్రా' వసూళ్ల అంశంపై తొలుత జనసేన నాయకులు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేసినట్లు.. అందుకే తాము కోర్టును ఆశ్రయించినట్లు జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు చెప్పారు. ఇటీవల సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేసి జనసేన నాయకులు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. సాయం కోసం వచ్చిన ఒక కుటుంబాన్ని అంబటి రాంబాబు లంచం అడిగారని జనసేన నాయకులు ఆరోపించడం సంచలనంగా మారింది. దీనిపై మంత్రి స్పందించి వివరణ కూడా ఇచ్చారు. ఆ వివాదం సద్దమణగముందే.. ఇప్పుడు 'సంక్రాంతి డ్రా' అంశం తెరపైకి వచ్చింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    అంబటి రాంబాబు

    తాజా

    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్
    UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది బ్యాంక్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ

    అంబటి రాంబాబు

    టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023