NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు
    తదుపరి వార్తా కథనం
    మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు
    అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు

    మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు

    వ్రాసిన వారు Stalin
    Jan 11, 2023
    07:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసులను ఆదేశించింది.

    సంక్రాంతి డ్రా పేరుతో వైసీపీ నాయకులు వసూళ్లకు పాల్పడినట్లు జనసేన నాయకులు ఆరోపించారు. అయితే ఈ వసూళ్ల పర్వం వైసీపీ నేత, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగినట్లు జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు.

    దీంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన గుంటూరు జిల్లా కోర్టు మంత్రిపై తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

    అంబటి

    పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు: జనసేన

    'సంక్రాంతి డ్రా' వసూళ్ల అంశంపై తొలుత జనసేన నాయకులు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేసినట్లు.. అందుకే తాము కోర్టును ఆశ్రయించినట్లు జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు చెప్పారు.

    ఇటీవల సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేసి జనసేన నాయకులు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. సాయం కోసం వచ్చిన ఒక కుటుంబాన్ని అంబటి రాంబాబు లంచం అడిగారని జనసేన నాయకులు ఆరోపించడం సంచలనంగా మారింది. దీనిపై మంత్రి స్పందించి వివరణ కూడా ఇచ్చారు. ఆ వివాదం సద్దమణగముందే.. ఇప్పుడు 'సంక్రాంతి డ్రా' అంశం తెరపైకి వచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? వై.ఎస్.జగన్
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025