Delhi official Logo: దేశ రాజధాని దిల్లీలో మొదటిసారిగా అధికారిక లోగో.. నవంబర్ 1న ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ - దేశ రాజధాని పేరుతో ప్రసిద్ధి పొందినప్పటికీ, ఇప్పటివరకు ఢిల్లీకోసం ప్రత్యేకంగా రూపొందించిన లోగో లేదు. భారతదేశంలోని చాలా రాష్ట్రాలకు తమ ప్రత్యేక గుర్తింపును తెలిపే లోగోలు ఉన్నప్పటికీ, ఢిల్లీకి ఇదివరకు అలాంటి గుర్తింపు అందలేదు. తాజాగా ప్రస్తుత ప్రభుత్వం ఈ లోగో ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ స్థాపన దినోత్సవం సందర్భంగా, నవంబర్ 1న ప్రభుత్వం కొత్త అధికారిక లోగోను ఆవిష్కరించనుంది. నూతన లోగో దేశ రాజధాని చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందనే భావన ఉంది. దేశ రాజధాని అయినప్పటికీ, ఢిల్లీని ప్రత్యేకంగా గుర్తించడానికి ప్రయత్నం ఇప్పటివరకు తగ్గిపోగా, కేంద్ర పాలిత ప్రాంతం కావడం వల్ల పెద్దగా కేంద్ర ప్రభుత్వ లోగోలే నగరంలో కనిపించేవి.
Details
సంస్కృతి ప్రతిబింబించేలా లోగో
దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వం ప్రత్యేక లోగోను రూపొందించే కీలక నిర్ణయం తీసుకుంది. లోగోను ఢిల్లీ ఆధునికత, పారదర్శకత, ప్రజా సేవా సంస్కృతి ప్రతిబింబించేలా రూపొందించారు. అదనంగా, నగరంలోని సంప్రదాయం, వారసత్వం, అభివృద్ధి వంటి అంశాలను సమన్వయం చేస్తూ ప్లాన్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రకారం, "మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానికి దాని గౌరవానికి తగిన ప్రత్యేక గుర్తింపును ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ లోగో ఆ ప్రయత్నానికి ప్రతీక." లోగో ఆవిష్కరణ ప్రధాన ఉద్దేశ్యం ఢిల్లీయను ఒక శక్తివంతమైన బ్రాండ్గా స్థాపించడం. ఇది రాజధానిని ప్రజాస్వామ్య విలువలు, సాంకేతిక పురోగతి, పౌర భాగస్వామ్యానికి ప్రతీకగా నిలబెడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.