NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు
    లాయర్లకు రూ.25.25కోట్లు చెల్లించిన దిల్లీ ప్రభుత్వం

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు

    వ్రాసిన వారు Stalin
    Jan 09, 2023
    05:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో సంబంధించి కోర్టులో హాజరవుతున్న న్యాయవాదులకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.25.25 కోట్లు చెల్లించినట్లు అధికార వర్గాలు తెలిపారు.

    రాజ్ భవన్ వర్గాల సమాచారం ప్రకారం.. సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ రూ. 25.25 కోట్లలో రూ. 18.97 కోట్లు అందుకున్నారు. మరో న్యాయవాది రాహుల్ మెహ్రా జైలులో ఉన్న మంత్రి సత్యేందర్ జైన్ కేసులలో తరచుగా హాజరవుతూ ఈ కాలంలో రూ. 5.30 కోట్లు పొందారు.

    దిల్లీ

    సంఘ్వీకే అధిక మొత్తం

    2021-22లో సింఘ్వీ తొలుత రూ. 14.85 కోట్లు, తర్వాత మరో రూ. 4.1 కోట్లు అందుకున్నారు. 2020-21లో మెహ్రా రూ. 2.4 లక్షలు, 2021-22లో రూ. 3.9 కోట్లు తీసుకున్నారు. 2021-22లో మద్యం కుంభకోణం కేసులో వాదిస్తున్న న్యాయవాదులకు రూ.16.09 కోట్లను ప్రభుత్వం ముట్టజెప్పింది. 2022-23 ఎనిమిది నెలల్లో రూ. 5.24 కోట్లను చెల్లించినట్లు అధికార వర్గాలు వెల్లడించారు.

    మద్యం కుంభకోణం వెలుగులోకి రాకముందు.. దిల్లీ ఆప్ ప్రభుత్వం లాయర్ల కోసం చేసిన ఖర్చు కేవలం రూ. 6.70 కోట్లు మాత్రమేనని, ఇందులో అధిక మొత్తం సాధారణ పరిపాలన విభాగం, ఆరోగ్య శాఖకు చెందినవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Vishwambhara : కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్ విశ్వంభర
    Munnar Travel Guide: పర్యాటకుల మనసు దోచుకునే మున్నార్ ప్రదేశాలు.. చూడాల్సిందే! పర్యాటకం
    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్
    Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ ! ఆటో మొబైల్

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? టాటా
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025