
Telangana: తెలంగాణ ప్రజలకు తప్పక గుర్తుంచుకోండి.. అన్ని సేవలకు ఓకే నెంబర్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో అన్ని రకాల అత్యవసర సేవల కోసం 112 నంబర్ అమల్లోకి వచ్చింది. ఇకపై పోలీస్, అగ్నిమాపక, రోడ్డుప్రమాదాలు, వైద్య, మహిళా, శిశు సంబంధిత సేవలకు ఒక్క 112 నంబర్కే డయల్ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నంబర్ ద్వారా కాల్ చేసిన వెంటనే జీపీఎస్ సాయంతో కాలర్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, నేరుగా సేవలు అందిస్తామని అధికారులు తెలిపారు. అంతేకాక ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్యానిక్ బటన్ను గట్టిగా నొక్కితే 112 నంబర్కు కాల్ కనెక్ట్ అవుతుంది.
Details
నిరంతర సేవలు
దేశవ్యాప్తంగా ఇదే అత్యవసర నంబర్గా అమల్లో ఉంది. తాజాగా తెలంగాణలోనూ దీనిని అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఎమర్జెన్సీ రిస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్) రూపంలో ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 24 గంటలపాటు ప్రజలకు సేవలు అందే విధంగా ఏర్పాటు చేశారు. 112 నంబర్ మొబైల్ లేదా ల్యాండ్లైన్ నుంచి 24×7 పనిచేస్తుంది. నేరాలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డుప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు బాధితులు ఈ నంబర్ డయల్ చేయగానే ఆయా విభాగాల నుంచి సహాయం అందేలా వ్యవస్థ సిద్ధం చేశారు. కాల్ చేసిన వెంటనే జీపీఎస్ ద్వారా కాలర్ ఉన్న ప్రదేశాన్ని స్వయంచాలకంగా గుర్తిస్తారు.
Details
ఈ విషయాలను తెలుసుకోండి
దీనివల్ల సమీపంలోని పోలీస్ వాహనం, అంబులెన్స్ లేదా అగ్నిమాపక వాహనం వెంటనే ఘటనాస్థలానికి చేరుతుంది. స్మార్ట్ఫోన్ వినియోగదారులు పవర్ బటన్ను మూడు సార్లు వేగంగా నొక్కితే 112 నంబర్కు పానిక్ కాల్ యాక్టివేట్ అవుతుంది. 112 ఇండియా మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.