NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

    వ్రాసిన వారు Stalin
    Mar 28, 2023
    06:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమరావతి కేసును వెంటనే విచారించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను జులై 11న విచారించనున్నట్లు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడి న ధర్మాసనం పేర్కొంది.

    అమరావతి రాజధాని పిటిషన్‌ను త్వరగా విచారించాలని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా, విచారణను జులై 11న చేపడుతామని న్యాయమూర్తులు వెల్లడించారు.

    అమరావతిని రాజధాని నగరంగా కొనసాగించడాన్ని సమర్థిస్తూ రైతులతోపాటు, ఇతర వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లు, అమరావతికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లన్నీ కలిపి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్, అమరావతి రైతుల తరఫున శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు.

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్

    అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 3న రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది.

    అమరావతిలో పెండింగ్‌లో ఉన్న పనులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని కొన్ని అంశాలపై గతంలో సుప్రీంకోర్టు స్టే విధించింది.

    వాస్తవానికి అమరావతి అంశం జనవరి 31న విచారణకు రావలసి ఉంది. సుప్రీంకోర్టు దానిని మార్చి 28కి వాయిదా వేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    అమరావతి
    సుప్రీంకోర్టు
    రాజధాని

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    ఆంధ్రప్రదేశ్

    అమరావతి భూముల కేసు: హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు హైదరాబాద్
    జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్
    మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా? ప్రభుత్వం
    చంద్రయాన్-3 కీలక రాకెట్ ఇంజన్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో ఇస్రో

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం

    సుప్రీంకోర్టు

    యాంటీట్రస్ట్ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన గూగుల్ గూగుల్
    సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలి: కిరెన్ రిజిజు కిరెణ్ రిజిజు
    'రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే ప్రక్రియ జరుగుతోంది: సుప్రీంకోర్టుకు తెలిపి కేంద్రం భారతదేశం
    సుప్రీంకోర్టు ఆదేశాలు: జీఓ నెం.1 పిటిషన్‌పై 23న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ఆంధ్రప్రదేశ్

    రాజధాని

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025