NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో మినహాయింపు ఉండదు: సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం
    Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో మినహాయింపు ఉండదు: సుప్రీంకోర్టు
    Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో మినహాయింపు ఉండదు: సుప్రీంకోర్టు

    Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో మినహాయింపు ఉండదు: సుప్రీంకోర్టు

    వ్రాసిన వారు Stalin
    Mar 04, 2024
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎంపీలు, ఎమ్మెల్యేల లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

    ఎంపీలు, ఎమ్మెల్యేల లంచం తీసుకుని, పార్లమెంటు, అసెంబ్లీలో ప్రకటనలు చేసినా.. ఓటింగ్‌ చేసినా క్రిమినల్‌ చర్యల నుంచి ఎలాంటి మినహాయింపు ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది.

    ఈ మేరకు 1998 నాటి పాత నిర్ణయాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

    ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.

    రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు.

    సుప్రీంకోర్టు

    పీవీ నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పును తోసిపుచ్చిన సుప్రీం

    ఈ కేసుకు తొలుత ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారించింది.

    ఈ క్రమంలో ఈ కేసులో అంశాలను విస్తృత ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, ఐదుగురు సభ్యుల ధర్మాసనం దానిని ఏడుగురు సభ్యుల బెంచ్ పరిశీలనకు అప్పగించింది.

    1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు ఎంపీలకు డబ్బులు ఆశాచూపారని ఆరోపణ. ఈ అంశంపై అప్పట్లో సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారించింది.

    1998లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆర్టికల్ 105 (2) మరియు 194 (2) ప్రకారం.. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల సభ్యులు తమ విధులను స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించేందుకు లంచాల కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ధర్మాసనం అప్పట్లో మినహాయింపు ఇచ్చింది.

    ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    తాజా వార్తలు

    తాజా

    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్
    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్
    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం

    సుప్రీంకోర్టు

    Supreme Court: మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరించిన సుప్రీం  భారతదేశం
    Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రంకోర్టులో విచారణ.. 8వ తేదీకి వాయిదా  చంద్రబాబు నాయుడు
    Supreme Court: పాక్ కళాకారులను నిషేధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు  పాకిస్థాన్
    Supreme Court: సీఎంను కలుసుకోండి.. తమిళనాడు గవర్నర్‌కు 'సుప్రీం' సూచన తమిళనాడు

    తాజా వార్తలు

    Himachal crisis: మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా.. హిమాచల్‌లో ముదురుతున్న సంక్షోభం హిమాచల్ ప్రదేశ్
    RGV -Vyuham: మార్చి 2న 'వ్యూహం' విడుదల.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్  రామ్ గోపాల్ వర్మ
    MP Ramulu: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు  బీఆర్ఎస్
    అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో బైడెన్ స్థానంలో మిచెల్ ఒబామా!  అమెరికా అధ్యక్ష ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025