NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bomb Threat: జైపూర్‌ స్కూళ్లకు బాంబు బెదిరింపు .. విద్యార్థులను బయటకు పంపిన సిబ్బంది
    తదుపరి వార్తా కథనం
    Bomb Threat: జైపూర్‌ స్కూళ్లకు బాంబు బెదిరింపు .. విద్యార్థులను బయటకు పంపిన సిబ్బంది
    జైపూర్‌ స్కూళ్లకు బాంబు బెదిరింపు .. విద్యార్థులను బయటకు పంపిన సిబ్బంది

    Bomb Threat: జైపూర్‌ స్కూళ్లకు బాంబు బెదిరింపు .. విద్యార్థులను బయటకు పంపిన సిబ్బంది

    వ్రాసిన వారు Stalin
    May 13, 2024
    11:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని 4 పాఠశాలలకు సోమవారం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.

    విద్యాధర్ నగర్‌లో ఉన్న మహేశ్వరి పబ్లిక్ స్కూల్‌తో పాటు పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

    పాఠశాలలకు బాంబులు వేస్తామని ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు పంపారు.

    ఈ బెదిరింపుతో పాఠశాల యాజమాన్యంలో భయాందోళనలు నెలకొన్నాయి.

    అదే సమయంలో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. బెదిరింపులు వచ్చిన పాఠశాలల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

    Details 

    పిల్లలను పాఠశాలల నుంచి బయటకు తీసుకొచ్చారు

    నాలుగు పెద్ద పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ తెలిపారు.

    బాంబు నిర్వీర్య స్క్వాడ్‌లు, డాగ్‌లతో పోలీసు బృందాలు పాఠశాలలకు చేరుకున్నాయి.

    పాఠశాలలోని విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అదే సమయంలో, ఈ-మెయిల్ పంపిన వారిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    సోమవారం ఉదయం 6 గంటలకు మోతీ డంగ్రీలోని ఎంపీఎస్ స్కూల్‌కు మెయిల్‌లో బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

    దీని తర్వాత ఎంపీఎస్, మనక్ చౌక్, విద్యాధర్ నగర్, వైశాలి నగర్, బగ్రులోని నివారు రోడ్డులో ఉన్న పాఠశాలలను పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. మల్పుర్‌గేట్ బంబలా పులియాలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు సమాచారం.

    Details 

    జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు 

    అంతకుముందు ఆదివారం, జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా దేశంలోని అనేక విమానాశ్రయాలపై బాంబు దాడి చేస్తామని బెదిరించిన విషయం తెలిసిందే.

    జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, గౌహతి, జమ్ము, లక్నో, పాట్నా, అగర్తల, ఔరంగాబాద్, బాగ్ధుగ్రా, భోపాల్, కాలికట్ విమానాశ్రయాల్లోని భవనాల్లో పేలుడు పదార్థాలను అమర్చినట్లు బెదిరింపు మెయిల్‌లో రాశారు.

    ఆదివారం మధ్యాహ్నం CISF అధికారిక IDకి వచ్చిన బెదిరింపు ఇ-మెయిల్ కారణంగా విమానాశ్రయ పరిపాలనలో భయాందోళనలు నెలకొన్నాయి.

    సమాచారం అందుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని ఎయిర్‌పోర్టులో వెతికినా ఏమీ దొరకకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    రాజస్థాన్

    Rajasthan election: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ  పోలింగ్
    Rajasthan Kota: కోటాలో 20 ఏళ్ల నీట్‌ విద్యార్థి ఆత్మహత్య.. 28కి పెరిగిన ఆత్మహత్యల సంఖ్య  ఆత్మహత్య
    కన్న కూతురు గొంతు కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి హత్య
    China Pneumonia Virus: చైనాలో న్యుమోనియా.. భారత్‌లో ఆరు రాష్ట్రాల్లో హై అలెర్ట్! చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025