NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tirupati Laddoo Row: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు 
    తదుపరి వార్తా కథనం
    Tirupati Laddoo Row: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు 
    తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు

    Tirupati Laddoo Row: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 20, 2024
    03:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తిరుమలలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు వాడటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఈ విషయంపై వైసీపీ నేతలు, టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలు ఘాటుగా స్పందించారు

    వారు తిరుమలలో ఎలాంటి అపచారం జరుగలేదని, నెయ్యి, ప్రసాదాలలో ఎలాంటి కల్తీ లేదని స్పష్టం చేశారు.

    ఈ విషయం మీద టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు స్పందించారు. గతంలో నెయ్యి సరఫరా, నాణ్యతపై ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదని చెప్పారు.

    అయితే, జంతువుల కొవ్వు కలిసిన నాసిరకం నెయ్యి లడ్డూ, ఇతర ప్రసాదాలకు వినియోగించారని స్పష్టం చేశారు.

    వివరాలు 

    టెస్టుకు గుజరాత్ ల్యాబ్‌కు పంపించాం: ఈవో 

    శ్యామలరావు మాట్లాడుతూ.. "నెయ్యి వంటి పదార్థాలపై కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవడానికి నిర్ధిష్టమైన ల్యాబ్ కావాలి. అందుకు రూ.75 లక్షలు ఖర్చు అవుతుంది. మనకు స్వంత ల్యాబ్ ఉంటే ఈ సమస్యలు ఉండేవి కాదని చెప్పారు. లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయి. నెయ్యి క్వాలిటీ బాగాలేదని ఫీడ్ బ్యాక్ వస్తోంది.సరఫరాదారులకు మేము ముందుగానే హెచ్చరికలు ఇచ్చామన్నారు.

    తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ లిమిటెడ్‌కు మార్చి 12, 2024న టెండర్ పిలిచాము, మే నెలలో దాన్ని ఫైనల్ చేసాము. రూ.320 నుండి రూ.410కి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు.

    వివరాలు 

     బయటి ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించి పరీక్షలు: ఈవో  

    ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం ఎస్ వాల్యు టెస్టులు చేయాలి.39 రకాల పరీక్షలు నిర్వహించాలి.ఎస్ వాల్యు టెస్టులో 5రకాల పరీక్షలు ఉంటాయి. అప్రోచ్ మొత్తం క్వాలిటీని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు.

    98.6నుండి 104వరకు ఫ్యాట్ ఉండాలి,కానీ పరీక్షల్లో 20.3వచ్చినట్లు కనిపిస్తే,అది కల్తీ ఎంత తీవ్రంగా జరిగిందో తెలియజేస్తుంది"అని తెలిపారు.

    తీవ్రమైన ఆరోపణలు రావడంతో, టీటీడీలో నాణ్యమైన ల్యాబ్ లేకపోవడంతో,తొలిసారిగా బయటి ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించి పరీక్షలు నిర్వహించామన్నారు.

    నాలుగు ట్యాంకర్లలో నెయ్యి నాణ్యత లేదు అని గుర్తించామన్నారు.గుజరాత్‌లోని ఆనంద్ దగ్గర ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేపట్టినట్లు తెలిపారు.

    ఇక్కడ విదేశాలకు పంపించే పదార్థాలను పరిశీలిస్తున్నారు.అయితే, నాణ్యత కొరత ఉన్నట్లు పరీక్షల ఫలితాలు సూచించిన తర్వాత,సరఫరాదారులను హెచ్చరించగా,వారు నెయ్యి నాణ్యతను మెరుగుపరచారని మీడియాకు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి దేవస్థానం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025