NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తిరుమల: టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును దొంగిలించిన దుండగులు
    తదుపరి వార్తా కథనం
    తిరుమల: టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును దొంగిలించిన దుండగులు
    టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును దొంగిలించిన దుండగులు

    తిరుమల: టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును దొంగిలించిన దుండగులు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 24, 2023
    03:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల తిరుపతి దేవస్థానాని(టీటీడీ)కి చెందిన ఉచిత ఎలక్ట్రిక్ బస్సును దుండగులు దొంగిలించారు.

    ఈ విషయమై టీటీడి సిబ్బంది ట్రాన్స్ పోర్ట్ అధికారులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

    దుండగులు ఎత్తుకెళ్లిన ఎలక్ట్రిక్ బస్సు ఎక్కడుందో జీపీఎస్ సాయంతో పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో ఎలక్ట్రిక్ బస్సు ఉందని పోలీసులు తెలియజేసారు.

    ప్రస్తుతం ఈ బస్సును వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అయితే బస్సు చోరీ గురికావడంపై పోలీసులు ట్రాన్స్ పోర్ట్ జీ.ఎంపై సీరియస్ అయ్యారు.

    మరికొద్ది రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రత విషయంలో అలసత్వంగా ఉండడంపై సీరియస్ అయ్యారు.

    Details

    గతంలోనూ చోరీకి గురైన బస్సు 

    ఎలక్ట్రిక్ బస్సును దుండగులు దొంగిలించారన్న వార్త మీడియాలో వచ్చేవరకు పోలీసులకు సమాచారం అందించకపోవడంతో ట్రాన్స్ పోర్ట్ జీఎంపై పోలీసులు సీరియస్ గా స్పందించారు.

    గతంలో కూడా కారు మిస్సింగ్ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించలేదని పోలీసులు తెలియజేస్తున్నారు.

    టీటీడీ వాహనాల మిస్సింగ్ సంఘటనలు జరగడం ఇది మూడవసారని చెప్పవచ్చు. గతంలో ఎలక్ట్రిక్ బస్సును దొంగిలించిన దుండగులు కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద వదిలేసి వెళ్లిపోయారు.

    వరుస దొంగతనాల నేపథ్యంలో ట్రాన్స్ పోర్ట్ జీఎంపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి దేవస్థానం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025