NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్..
    తదుపరి వార్తా కథనం
    TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్..
    తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్..

    TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 30, 2024
    04:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనం ఇచ్చే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది.

    కానీ, ఇటీవల తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ సరైన గుర్తింపు ఇవ్వడంలో కొంత వివాదం చోటుచేసుకుంది.

    ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ స్వీకరించకపోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది.

    టీటీడీ, తెలంగాణ ప్రాతినిధుల సిఫారసు లేఖలు చెల్లవని వివరణ ఇచ్చినప్పుడు, దీనిపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    వివరాలు 

    వారానికి రెండు సార్లు సిఫారసు లేఖలు 

    అయితే, ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఈ వివాదం మీద కీలక నిర్ణయం తీసుకుంది.

    బోర్డులోని మెజారిటీ సభ్యులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కోరడంతో, టీటీడీ ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.

    ఇక, తెలంగాణ ప్రజాప్రతినిధులకు వారానికి రెండు సార్లు సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.

    ఈ ప్రకటన నేపథ్యంలో, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు.

    ఇక నుండి వారానికి రెండు సార్లు రూ.300 విలువైన దర్శనానికి సిఫారసు లేఖలు ఇచ్చేందుకు అంగీకరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నిర్ణయం, తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్తగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి దేవస్థానం
    తెలంగాణ

    తాజా

    Lalu Prasad Yadav: పెద్ద కుమారుడిపై లాలూ కఠిన నిర్ణయం.. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కీలక ప్రకటన! లాలూ ప్రసాద్ యాదవ్
    Ukraine crisis: రష్యా భీకర దాడి.. ఉక్రెయిన్‌పై 367 డ్రోన్లు, క్షిపణులతో భారీ విధ్వంసం ఉక్రెయిన్
    Hazardous cargo: కేరళ తీరంలో లైబీరియా నౌక మునిగింది.. హై అలర్ట్‌ ప్రకటించిన అధికారులు లైబీరియా
    #NewsBytesExplainer: మైసూర్ శాండల్ సోప్ యజమాని ఎవరు..? ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ సంస్థదా..? భారతదేశం

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్

    తెలంగాణ

    VRO: తెలంగాణలో మళ్లీ VRO వ్యవస్థ.. సంక్రాంతి లోపే వీఆర్వోల నియామకం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన భారతదేశం
    Inter Exams: మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు.. షెడ్యూల్ రెడీ చేస్తున్న బోర్డు ఇంటర్
    TGPSC Group 2 Exam: రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు, 1,368 కేంద్రాల్లో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు ఇండియా
    Cars registrations: తెలంగాణలో కార్ల రిజిస్ట్రేషన్లలో తగ్గుదల.. ఆదాయ వృద్ధిలో వెనుకబడిన రవాణా శాఖ కార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025