
Tummala Nageswara Rao: రైతులకు రికార్డు స్థాయిలో నిధుల జమ.. 6 రోజుల్లో రూ. 7,770 కోట్లు జమ!
ఈ వార్తాకథనం ఏంటి
రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమ కొనసాగుతోంది. ఇవాళ 9 ఎకరాల వరకు ఉన్న రైతులకు భరోసా నిధులను విడుదల చేశారు. మొత్తం ఆరు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ. 7,770.83 కోట్లను జమ చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు నిధులను విడుదల చేయడానికి నెలల సమయం పట్టేది. కానీ ఇప్పుడు మేం వేగంగా రైతు భరోసా నిధులను అందజేస్తున్నాం.
Detalis
బీఆర్ఎస్ నేతలు డ్రామా చేస్తున్నారు
ఇంత జరుగుతుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం డ్రామాలు చేస్తున్నారని మంత్రి తుమ్మల విమర్శించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న సాగుభూములను కూడా గుర్తించి వాటికీ రైతు భరోసా నిధులను చెల్లిస్తామని ఆయన తెలిపారు. పంట సాగుతున్న ప్రతి భూమికీ రైతు భరోసా అందిస్తామన్నారు. కోతల ప్రభుత్వమని పేరుపడిన భారాస పార్టీని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారన్నారు. రుణమాఫీని పూర్తి చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నేళ్లు పట్టిందో ప్రజలకు తెలుసని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.