NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తర్‌ప్రదేశ్: రైలులో మహిళా పోలీసుపై దాడి.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి 
    తదుపరి వార్తా కథనం
    ఉత్తర్‌ప్రదేశ్: రైలులో మహిళా పోలీసుపై దాడి.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి 
    ఉత్తర్‌ప్రదేశ్: రైలులో మహిళా పోలీసుపై దాడి.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి

    ఉత్తర్‌ప్రదేశ్: రైలులో మహిళా పోలీసుపై దాడి.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 22, 2023
    10:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గత నెలలో రైలు కంపార్ట్‌మెంట్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళా పోలీసుపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు శుక్రవారం అయోధ్యలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

    ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు వ్యక్తులకు బుల్లెట్ గాయాలు అవ్వడంతో ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

    ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు, లక్నో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్త బృందం శుక్రవారం ఇనాయత్ నగర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ను ప్రారంభించింది. ఎన్‌కౌంటర్‌లో నిందితుడు అనీష్‌ను కాల్చి చంపారు.

    కలందర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి రతన్ శర్మ కూడా ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డారు.

    Details 

    రైలు సీటు విషయంలో మహిళా పోలీసుకు,నిందితులకు గొడవ 

    ఆగస్ట్ 30న అయోధ్య స్టేషన్‌లోని సరయూ ఎక్స్‌ప్రెస్‌లోని రైలు కంపార్ట్‌మెంట్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళా కానిస్టేబుల్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు రైల్వే పోలీసు అధికారులు గుర్తించారు.

    ఆమె ముఖంపై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆమె పుర్రెపై రెండు పగుళ్లు వచ్చాయి.

    ఆమెను లక్నోలోని KGMC ఆసుపత్రిలో చేర్చారు.ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

    ఆమె ఎవరో పోలీసులు వెల్లడించలేదు.రైలు సీటు విషయంలో మహిళా పోలీసు నిందితుడితో గొడవ పడ్డారని దీనిపై విచారణ జరిపిన అధికారులు తెలిపారు.

    రైలులో పై బెర్త్‌లో కూర్చున్న ఆమెతో మాన్‌కాపూర్ స్టేషన్‌లో దుండగులు గొడవకు దిగారు.

    Details 

    RPFను మందలించిన ధర్మాసనం 

    గొడవ తీవ్రమై రైలు వేగం పుంజుకున్న తర్వాత నిందితులు ఆమెపై దారుణంగా దాడి చేసి అనంతరం అయోధ్య స్టేషన్‌లో రైలు దిగి పారిపోయారని పోలీసులు తెలిపారు.

    కానిస్టేబుల్ సోదరుడి లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు, ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిందితుడిని పట్టుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు.

    కొన్ని రోజుల తర్వాత, సెప్టెంబర్ 4న, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రిటింకర్ దివాకర్, జస్టిస్ శ్రీవాస్తవతో కూడిన ధర్మాసనం, కేంద్రానికి, రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్)కి నోటీసులు అందజేసింది.

    కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, "తన విధుల నిర్వహణలో విఫలమైనందుకు" బెంచ్ RPFను మందలించింది.

    నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు ఈ ఉదయం నిందితులు తారసపడడంతో కాల్పులు ప్రారంభించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఉత్తర్‌ప్రదేశ్: ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి

    UP: Man killed and two arrested in an encounter in Ayodhya

    Read @ANI story | https://t.co/LC5N9nj8nD#Encounter #UttarPradesh #Ayodhya pic.twitter.com/i7HAjDcqIX

    — ANI Digital (@ani_digital) September 22, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    అయోధ్య

    తాజా

    Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా? జ్యోతి మల్హోత్రా
    #NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాల చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ భారతదేశం
    Visa: అమెరికా వీసా కోసం 13 నెలల వరకు నిరీక్షణ.. భారతీయ దరఖాస్తుదారులకు తలనొప్పి! అమెరికా
    Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్ అశ్విని వైష్ణవ్

    ఉత్తర్‌ప్రదేశ్

    లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌ భూషణ్‌కు షాక్.. ఈనెల 18న రావాలని దిల్లీ కోర్టు ఆదేశం రెజ్లింగ్
    Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి  దిల్లీ
    గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో భవనం నుంచి దూకేస్తున్న జనం  దిల్లీ
    కన్వర్ యాత్రలో అపశ్రుతి, విద్యుదాఘతంతో ఐదుగురు భక్తుల మృతి భారతదేశం

    అయోధ్య

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల శ్రీరాముడు
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025