NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar: బిహార్‌ మాజీ సీఎం,కేంద్రమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ మనవరాలి హత్య
    తదుపరి వార్తా కథనం
    Bihar: బిహార్‌ మాజీ సీఎం,కేంద్రమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ మనవరాలి హత్య
    బిహార్‌ మాజీ సీఎం,కేంద్రమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ మనవరాలి హత్య

    Bihar: బిహార్‌ మాజీ సీఎం,కేంద్రమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ మనవరాలి హత్య

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 09, 2025
    07:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి అయిన జితన్ రామ్ మాంఝీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది

    ఆయన మనవరాలు సుష్మా దేవి(32)తన భర్త చేతిలోనే హత్యకు గురయ్యారు.

    ఈ దారుణ ఘటన బీహార్‌లోని గయా జిల్లాలోని టెటువా గ్రామంలో జరిగింది.

    భార్యాభర్తల ఘర్షణే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

    సుష్మా దేవి, తన పిల్లలు, సోదరి పూనమ్ కుమారితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ దుశ్చర్య జరిగింది.

    పూనమ్ తెలిపిన వివరాల ప్రకారం,మధ్యాహ్నం 12గంటల సమయంలో సుష్మా భర్త రమేష్ పని ముగించుకుని ఇంటికి వచ్చాడు.

    ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది.ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో,రమేష్ నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు.అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

    వివరాలు 

    రమేష్‌కు ఉరిశిక్ష వేయాలని పూనమ్ డిమాండ్

    సుష్మా,రమేష్ వివాహం 14 ఏళ్ల క్రితం జరిగింది.సంఘటన జరిగిన సమయంలో పక్క గదిలో ఉన్న పూనమ్, పిల్లలు ఆ దారుణ ఘట్టాన్ని చూసి షాక్‌కు గురయ్యారు.

    రక్తపు మడుగులో పడివున్న సుష్మాను చూసిన వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

    కాల్పుల సమయంలో సుష్మా అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం.

    తన సోదరిని హత్య చేసిన రమేష్‌కు ఉరిశిక్ష వేయాలని పూనమ్ డిమాండ్ చేశారు.

    ఇంట్లో తుపాకీ పేలుడు శబ్దం వినగానే స్థానికులు అక్కడికి చేరుకొని పరిస్థితేంటో తెలుసుకున్నారు.

    గయా జిల్లా ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ,నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

    అదేవిధంగా,ఫోరెన్సిక్ బృందం, టెక్నికల్ నిపుణులను ఆధారాలు సేకరించేందుకు ఘటనాస్థలికి పంపించినట్లు చెప్పారు. కేసుపై విచారణ కొనసాగుతున్నదని వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    బిహార్

    NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మొదటి అరెస్ట్  నీట్ స్కామ్ 2024
    Bihar woman:పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన బీహార్ మహిళ అరెస్ట్ భారతదేశం
    Bihar: బీహార్‌లో 16 మంది ఇంజనీర్లు సస్పెండ్.. 17 రోజుల్లో 12 వంతెనలు కూలిపోవడంపై చర్యలు   భారతదేశం
    Bihar: బీహార్ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్లుగా మారనున్న ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025