NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / UttarPradesh: ప్రవేట్ స్కూల్ టీచర్ దాష్టీకం.. వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్ధి
    తదుపరి వార్తా కథనం
    UttarPradesh: ప్రవేట్ స్కూల్ టీచర్ దాష్టీకం.. వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్ధి
    ప్రవేట్ స్కూల్ టీచర్ దాష్టీకం.. వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్ధి

    UttarPradesh: ప్రవేట్ స్కూల్ టీచర్ దాష్టీకం.. వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్ధి

    వ్రాసిన వారు Stalin
    May 19, 2024
    06:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పూర్వకాలంలో గురు కులాలు ఉన్న రోజుల్లో విద్యార్ధులు గురువు బంధానికి విలువ ఉండేది.

    కాలానుగుణంగా వచ్చిన మార్పులతో ప్రభుత్వ పాఠశాలలకు బదులు ప్రవేట్ స్కూళ్లు వచ్చాయి.ఇంత వరకు పర్వాలేదు.

    ఉత్తర్‌ప్రదేశ్ బలియాలోని ఓ ప్రవేట్ స్కూల్ టీచర్ రాఘవేంద్ర,ప్రతీక్ అనే ఓ పదో తరగతి విద్యార్ధిని ఈ నెల 13న చితక్కొట్టాడు. దీంతో ఆ విద్యార్ధికి వినికిడి శక్తి కోల్పోయాడు.

    ఇంతకీ ఆ విద్యార్ధి చేసిన తప్పేమిటంటే , తోటి విద్యార్ధితో మాట్లాడటమే.

    ఆ లెక్కల టీచర్ కు ఆగ్రహం తెప్పించింది. పైకి లేవమని ఎడా పెడా బాదేశాడు. 14ఏళ్ల సున్నితమైన ప్రతీక్ .. టీచర్ దెబ్బలకు తాళ లేక సొమ్మసిల్లాడు.

    అప్పటి నుంచి ప్రతీక్ స్కూల్ కు వెళ్లడం మానేశాడు.

    Details 

    ప్రతీక్ కు కుడి చెవి వినికిడి సమస్య

    దీంతో కంగారు పడిన ప్రతీక్ తండ్రి ప్రవీణ్ కుమార్ మధుకర్ స్కూల్ కు వెళ్లడం లేదని నిలదీశాడు. ఇదిలా ఉంటే జరిగిన సంగతిని పూస గుచ్చినట్లు తండ్రికి చెప్పి భోరున ఏడ్చేశాడు ప్రతీక్.

    దీంతో షాక్ అయిన ప్రవీణ్ కుమార్ తన కుమారుడ్ని ఓదార్చాడు. అయితే టీచర్ కొట్టిన దెబ్బలకు తన ప్రతీక్ కు కుడి చెవి వినికిడి సమస్య వచ్చిందని కొంత ఆలస్యంగా గ్రహించాడు.

    ఈ విషయమై ప్రవీణ్ కుమార్ కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన కుమారుడి బంగారు భవిష్యత్తును చిదిమేసిన టీచర్ రాఘవేంద్రపై..స్ధానిక ఉభాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

    Details 

    భారతీయ శిక్షాస్మృతి కింద టీచర్ పై కేసు

    దీనిపై అకారణంగా దాడి (323) , గాయపరచడం (325)సంబంధిత సెక్షన్ ల ప్రకారం భారతీయ శిక్షాస్మృతి కింద కేసు నమోదైంది.

    విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఉభాన్ స్టేషన్ ఆఫీసర్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. రెండో స్థానానికి స్మృతి మంధాన స్మృతి మంధాన
    BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణస్వీకారం  సుప్రీంకోర్టు
    India-China: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ.. రణ్‌ధీర్‌ జైస్వాల్‌
    Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె? అనితా ఆనంద్

    ఉత్తర్‌ప్రదేశ్

    Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుంది: అఖిలేష్ యాదవ్  అఖిలేష్ యాదవ్
    UP Accident: చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 20 మంది మృతి  తాజా వార్తలు
    Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ భారత్ జోడో న్యాయ్ యాత్ర
    Rajya Sabha Election: రాజ్యసభ పోలింగ్ వేళ.. ఎస్పీ చీప్ విప్ పదవికి మనోజ్ పాండే రాజీనామా రాజ్యసభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025