NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: రైతులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు.. సన్నాల వడ్లకు బోనస్‌
    తదుపరి వార్తా కథనం
    Telangana: రైతులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు.. సన్నాల వడ్లకు బోనస్‌
    రైతులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు.. సన్నాల వడ్లకు బోనస్‌

    Telangana: రైతులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు.. సన్నాల వడ్లకు బోనస్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 24, 2024
    09:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో రైతులకు మేలు చేసే ఉద్దేశ్యంతో ఖరీఫ్ సీజన్ నుండి సన్న వడ్లు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు.

    ఈ సీజన్‌లో సేకరించిన ధాన్యాన్ని జనవరి నుండి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం రూపంలో పంపిణీ చేయనున్నామని వివరించారు.

    మొత్తం 3 కోట్ల మంది లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున అందించనున్నారని చెప్పారు.

    రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని కొంటామని ప్రకటించారు.

    సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పంట కొనుగోలు పై జేసీలు, పౌర సరఫరాల అధికారులు, మేనేజర్లతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.

    వివరాలు 

     అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ధాన్యం ఇవ్వరు: ఉత్తమ్ 

    ఖరీఫ్ సీజన్‌లో 60.39 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని, దాదాపు 146.28 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలు ఉన్నాయి.

    ఇందులో 91.28 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    సన్నాలు 36.80 లక్షల ఎకరాల్లో సాగు చేయబడగా, 88.09 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

    గతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ధాన్యం ఇవ్వడం జరగదు. సరిహద్దు రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యంపై కఠినమైన నిఘా పెట్టాలని మంత్రి సూచించారు.

    వివరాలు 

    అక్టోబరు తొలివారం నుంచి కొనుగోళ్లు 

    ఖరీఫ్‌ సీజన్‌ కోసం 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పనున్నాము. సన్న, దొడ్డు రకాలు వడ్ల కొరకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తాము. సహకార సంఘాల ద్వారా 4,496, ఐకేపీ ద్వారా 2,102, మరియు ఇతర మార్గాలు ద్వారా 541 కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. అక్టోబరు తొలివారంలో ప్రారంభమయ్యే ధాన్యం కొనుగోళ్లు జనవరి నెలాఖరు వరకు కొనసాగుతాయి.

    అక్టోబరు తొలివారంలో నల్గొండ,మెదక్‌లో, రెండవ వారంలో నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలలో సేకరణ ప్రారంభమవుతుంది. మూడవ వారంలో కరీంనగర్, జగిత్యాల, వరంగల్, జనగామ, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో సేకరణ జరగనుంది. నాలుగవ వారంలో మంచిర్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో కొనుగోళ్లు సేకరణ మొదలవుతుంది.

    వివరాలు 

    అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఉత్తమ్ 

    నవంబరు మొదటి వారంలో నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి, రెండవ వారంలో కుమురంభీం, భద్రాద్రి, గద్వాల, వనపర్తి, మూడవ వారంలో భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నాలుగవ వారంలో మహబూబాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్‌లలో కొనుగోళ్లు జరగనున్నాయి. తొ

    లిసారిగా 40 లక్షల టన్నుల ధాన్యం నిల్వకు గోదాములను సిద్ధం చేసాము. ధాన్యం సేకరణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    తెలంగాణ

    తాజా

    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్

    ఉత్తమ్ కుమార్‌రెడ్డి

    Telangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్‌  మల్లికార్జున ఖర్గే
    Telangana CM: తెలంగాణ సీఎం ఎంపికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు  భారతదేశం
    #TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే  తెలంగాణ
    Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  తెలంగాణ

    తెలంగాణ

    Laxma Reddy: బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ మంత్రి భార్య కన్నుమూత  బీఆర్ఎస్
    TGRTC: తెలంగాణ ఆర్టీసీకి కొత్త బస్సులు.. రద్దీని తగ్గించేందుకు సీఎం కీలక అదేశాలు రేవంత్ రెడ్డి
    Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంటింటికీ ఫ్రీగా హైస్పీడ్ ఇంటర్నెట్ భారతదేశం
    Flood Effects: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. నేడు కేంద్ర బృందం పర్యటన భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025