NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తరాఖండ్​లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్
    తదుపరి వార్తా కథనం
    ఉత్తరాఖండ్​లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్
    హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్

    ఉత్తరాఖండ్​లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 18, 2023
    04:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పర్యటనలో ఓ పోలీస్ ఉన్నతాధికారిపై వేటు పడింది. సెల్ ఫోన్‌ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్‌ చేసినందుకు పోలీస్ శాఖ ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

    గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్​లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉద్ధృతంగా ప్రవహించిన నదులు, వంతెనలను ముంచెత్తాయి.

    జన జీవనం స్థంభించిపోయింది. రోడ్లు మీద వరద నీటితో రాకపోకలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ మేరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ 11న వరద ప్రభావిత ప్రాంతాల(కోట్‌ద్వార్‌) సందర్శనార్థం సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి నడుం బిగించారు.

    DETAILS

    సీఎం హెలికాఫ్టర్‌ దిగిన సమయంలో ఫోన్‌లో  మాట్లాడుతున్న ఏఎస్పీ  

    ఉత్తరాఖండ్​లో పౌరీ గర్వాల్ జిల్లా కోట్‌ద్వార్‌ లో సీఎం ధామి పర్యటించాారు. ఇదే సమయంలో అదనపు ఎస్పీ శేఖర్ సుయాల్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

    సీఎం హెలికాప్టర్ రాకను గుర్తించి అధికార యంత్రాంగం హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంది.

    ఈ క్రమంలోనే సీఎం హెలికాఫ్టర్‌ దిగిన సమయంలో సదరు ఏఎస్పీ ఫోన్‌లో సంభాషిస్తున్నాడు.ఒక చేత్తో ఫోన్‌ను చెవిలో పెట్టుకుని, మరో చేత్తో ముఖ్యమంత్రికి సెల్యూట్‌ చేశారు.

    ఘటనపై వెంటనే పోలీస్ బాసులు ఏఎస్పీపై క్రమశిక్షణా చర్యల కింద వేటు చేశారు. నరేంద్రనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్ సెంటర్ కు బదిలీ చేశారు.

    ఈ మేరకు జై బలూనిని ఏఎస్పీగా నియమించారు.కోట్‌ద్వార్‌ లో వరద నీరు గ్రామాల్లోకి చేరడంతో చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయిన కారణంగా సీఎం పర్యటిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్
    ముఖ్యమంత్రి
    పుష్కర్ సింగ్ ధామి

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఇస్రో

    ముఖ్యమంత్రి

    పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత  పంజాబ్
    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  మణిపూర్
    కాంగ్రెస్: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్‌; కర్ణాటక సీఎం ఎవరు?  కాంగ్రెస్
    కర్ణాటక సీఎం ఎవరో తేలేది నేడే; ఖర్గే ఆధ్వర్యంలో కీలక సమావేశం కర్ణాటక

    పుష్కర్ సింగ్ ధామి

    ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు ఉత్తరాఖండ్
    Uttarakhand: ఉత్తరాఖండ్‌‌లో ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం  ఉత్తరాఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025