NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శవాల దిబ్బగా మారిన ఉత్తరాది.. హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి చేరిన మృతులు
    తదుపరి వార్తా కథనం
    శవాల దిబ్బగా మారిన ఉత్తరాది.. హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి చేరిన మృతులు
    హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి చేరిన మృతులు

    శవాల దిబ్బగా మారిన ఉత్తరాది.. హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి చేరిన మృతులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 17, 2023
    10:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారీ వరదలు ఉత్తరాది రాష్ట్రాలను శవాల దిబ్బగా మార్చుతున్నాయి. ఈ మేరకు భారీ ప్రాణ నష్టం సంభవించింది.

    గత కొద్ది రోజులగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో దాదాపుగా 81 మంది మరణించారు. ఈ క్రమంలోనే చాలా చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి.

    ఇళ్లు కూలి చనిపోవడంతో,ఆయా మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    గత 24 గంటల్లో కాంగ్రా జిల్లాలోని ఇండోరా,ఫతేపూర్ సబ్ డివిజన్లలో 1,731 మందిని కాపాడినట్లు డిప్యూటీ కమిషనర్ నిపున్ జిందాల్ వెల్లడించారు.

    వరద ప్రభావిత ప్రాంతాల నుంచి హెలికాప్టర్లు, ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ తో ప్రజలను తరలిస్తున్నట్లు చెప్పారు.

    రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.

    DETAILS

    పంజాబ్ కు తాకిన వరద ముప్పు

    హిమాచల్‌లో ఈసారి రుతుపవనాలు వచ్చిన తర్వాత 54 రోజుల్లోనే 742 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.

    మరోవైపు సోమవారం కొండచరియలు విరిగిపడి ఉత్తరాఖండ్‌లోని లక్ష్మణ్ ఝూలాలోని రిసార్ట్‌లో శిథిలాల నుంచి మొత్తం 4 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

    మంగళవారం అర్థరాత్రి మరో 2 మృతదేహాలు, బుధవారం ఇంకో 2 మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. తాజాగా నాలుగు మృతదేహాలను వెలికితీయడంతో ఉత్తరాఖండ్‌లో మృతుల సంఖ్య 10కి చేరింది.

    మరోవైపు పాంగ్,భాక్రా డ్యామ్‌ల నుంచి అదనపు నీటి విడుదలతో హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్, రూప్‌నగర్ జిల్లాలు నీట మునిగాయి.

    దీంతో పంజాబ్ రాష్ట్రాన్ని వరదలు చుట్టుముడుతున్నాయి. ఈ మేరకు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హిమాచల్ ప్రదేశ్
    భారీ వర్షాలు
    వరదలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    హిమాచల్ ప్రదేశ్

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం

    భారీ వర్షాలు

    రానున్న రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు ఆంధ్రప్రదేశ్
    తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ తెలంగాణ
    IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక  ఐఎండీ
    Heavy Rains: ఉత్తరాఖండ్‌లో ప్రమాదకర స్థాయిని దాటిన గంగానది; దిల్లీలో మళ్లీ ఉప్పొంగిన యమునా ఉత్తరాఖండ్

    వరదలు

    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు  హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025