NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మరోసారి ఉత్తరాదిలో కుంభవృష్టి.. ఒక్క హిమాచల్‌లోనే 51 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    మరోసారి ఉత్తరాదిలో కుంభవృష్టి.. ఒక్క హిమాచల్‌లోనే 51 మంది మృతి
    ఒక్క హిమాచల్‌లోనే 51 మంది మృతి

    మరోసారి ఉత్తరాదిలో కుంభవృష్టి.. ఒక్క హిమాచల్‌లోనే 51 మంది మృతి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 15, 2023
    11:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాది హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కుంభవృష్టి కారణంగా భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈమేరకు దాదాపుగా 54 మందికిపైగా ప్రాణం విడిచారు. వందలాది మంది తమ నివాసాలను కోల్పోయారు. వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలిపోయారు.

    కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులపై రాకపోకలు స్తంభించాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి.

    భారీ వర్షాల ధాటికి మరణించిన 54 మందిలో ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 51 మంది చనిపోవడం ఆ రాష్ట్రంలోని వరదల తీవ్రతను తెలియజేస్తోంది.

    హిమాచల్ లోని సిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై రెండు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనతో 14 మంది భక్తులు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.సోలాన్‌లో ఒకే కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులు మరణించడం గమనార్హం.

    DETAILS

    రెండు రోజుల పాటు చార్‌ధామ్ యాత్ర నిలిపివేత

    హిమాచల్ లోని 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రూ. 7,171 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మరోవైపు భీకర వర్షాల ధాటితి స్వాతంత్ర వేడుకలకు అంతరాయం కలిగింది.

    వర్షాల తాకిడికి ఉత్తరాఖండ్‌లో ముగ్గురు మరణించారు. మరో 10 మంది గల్లంతయ్యారు. వానలు విజృంభిస్తుండటంతో బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి వెళ్లే రహదారులపై రాకపోకలకు ఆటంకం కలిగింది.

    దీంతో చార్‌ధామ్ యాత్రను రెండు రోజుల పాటు నిలిపివేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాఖండ్
    భారీ వర్షాలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    హిమాచల్ ప్రదేశ్

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఇస్రో

    భారీ వర్షాలు

    Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర  ఉత్తరాఖండ్
    తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు తెలంగాణ
    #NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే  దిల్లీ
    తెలంగాణలో వచ్చే 5రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025