LOADING...
Parthiban vs Trisha Controversy : కుందవై వ్యాఖ్యపై రచ్చ.. త్రిషా ఆరోపణలకు పార్థిబన్ కౌంటర్
కుందవై వ్యాఖ్యపై రచ్చ.. త్రిషా ఆరోపణలకు పార్థిబన్ కౌంటర్

Parthiban vs Trisha Controversy : కుందవై వ్యాఖ్యపై రచ్చ.. త్రిషా ఆరోపణలకు పార్థిబన్ కౌంటర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు ఆర్‌.పార్థిబ‌న్‌, ప్రముఖ నటి త్రిష మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. చెన్నైలో నిర్వహించిన ఒక సినీ అవార్డుల కార్యక్రమంలో జరిగిన ఘటన ఈ వివాదానికి కారణమైంది. ఆ ఈవెంట్‌లో జరిగిన ర్యాపిడ్ ఫైర్ సెషన్ సమయంలో స్క్రీన్‌పై త్రిష ఫోటో కనిపించగానే ప్రేక్షకులు కుందవై అని వ్యాఖ్యానించారు. ఇది త్రిష పోషించిన పాత్రకు సంబంధించిన సూచన. దానికి స్పందించిన పార్థిబన్ సరదాగా మాట్లాడుతూ కుందవై కొంచెం ఇంట్లోనే ఉండాలి, అప్పుడు సమస్యలు ఉండవని వ్యాఖ్యానించారు. ఈ మాటలే తరువాత వివాదానికి దారితీశాయి.

Details

వెంట‌నే స్పందించిన పార్థిబ‌న్

ఈ వ్యాఖ్యలపై స్పందించిన త్రిష సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. అందులో ఆమె "మైక్ చేతిలో ఉండటం వల్ల ఒక వ్యాఖ్య తెలివైనదిగా మారదు. అది కేవలం అజ్ఞానాన్ని పెద్దగా వినిపించే అవకాశం మాత్రమే ఇస్తుందని పేర్కొన్నారు. ఆమె ఎక్కడా పార్థిబన్ పేరు ప్రస్తావించకపోయినా, ఈ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. వివాదం మరింత పెరగడంతో పార్థిబన్ వెంటనే స్పందించారు. తాను చేసిన వ్యాఖ్య పూర్తిగా సరదాగా చెప్పినదేనని, ఎవరికైనా అవమానం కలిగించాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. తన మాటల వల్ల త్రిషకు లేదా ఆమె అభిమానులకు బాధ కలిగితే క్షమించాలని కూడా ఆయన తెలిపారు.

Details

తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్త‌వం

తాజాగా పార్థిబన్ మరో వీడియోను విడుదల చేసి ఈ అంశంపై మరోసారి స్పందించారు. త్రిష తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. తాను విడుదల చేసిన క్షమాపణ వీడియో త్రిష ట్వీట్ చేయకముందే రికార్డ్ చేసినదని, ఆ తర్వాతే ఆమె పోస్ట్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు పార్థిబన్ చేసిన వ్యాఖ్యను సరదాగా తీసుకోవాలని భావిస్తుంటే, మరికొందరు మాత్రం సెలబ్రిటీలు పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement