Page Loader
Mamata Banerjee: బంగ్లాదేశ్‌లో హింస.. ప్రధాని మోదీకి, యూఎన్‌కి పశ్చిమ బెంగాల్ సీఎం విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌లో హింస.. ప్రధాని మోదీకి, యూఎన్‌కి పశ్చిమ బెంగాల్ సీఎం విజ్ఞప్తి

Mamata Banerjee: బంగ్లాదేశ్‌లో హింస.. ప్రధాని మోదీకి, యూఎన్‌కి పశ్చిమ బెంగాల్ సీఎం విజ్ఞప్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2024
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు పెరుగుతుండడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం హిందూ నాయకులను అరెస్ట్ చేస్తూ, వ్యాపారాలు, ఇళ్లే లక్ష్యంగా దాడులను చేస్తోంది. షేక్ హసీనా రాజీనామా చేసి, భారత్‌లో ఆశ్రయం పొందిన తర్వాత మైనారిటీలపై దాడులు మరింత తీవ్రమయ్యాయి. మైనారిటీల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఈ పరిస్థితిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హింసను నివారించేందుకు ఐక్యరాజ్య సమితి శాంతి దళాలను మోహరించాలని ఆమె సూచించారు.

Details

చిన్మోయ్‌పై దేశద్రోహం కేసు

మతం, కులం, ప్రాంతం అనే తేడా లేకుండా తాము అన్ని రకాల దాడులను ఖండిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని మమతా సూచించారు. అక్కడి మన ప్రజలను సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని తాము సంకల్పించామని, వారికి ఆహార కొరత రాకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ గురువు చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. హిందూ హక్కుల కోసం నిలబడ్డ చిన్మోయ్‌పై దేశద్రోహం కేసు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.

Details

హిందువులకు రక్షణ కల్పించాలి

భారత ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించింది. మైనారిటీల రక్షణకు సంబంధించి బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే, అక్కడి ప్రభుత్వం నుంచి సానుకూల ప్రతిస్పందన లేకపోవడం గమనార్హం. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఈ పరిణామాలు అంతర్జాతీయంగా మైనారిటీల హక్కులపై ఆందోళన కలిగిస్తున్నాయి. దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, భద్రతలు ప్రభావితమవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.